రైతులకు వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకొచ్చింది. నైరుతి రుతుపవనాలు ఆశించినట్టుగానే జూన్ 1వ తేదీన కేరళను తాకాయి. రుతు పవనాల రాకతో కేరళలో రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ ( IMD ) వెల్లడించింది. కేరళలోని కొయికోడ్ జిల్లాలో ( Kozhikode ) భారీ వర్షపాతం నమోదైంది.
కోల్కతా : అంఫాన్ తుఫాన్ ( Cyclone Amphan ) భారీ ప్రాణ, ఆస్టి నష్టాన్ని మిగిల్చింది. కేవలం పశ్చిమ బెంగాల్లోనే ( West Bengal ) అంఫాన్ తుఫాన్ తాకిడికి 72 మంది మృతి చెందినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( CM Mamata Banerjee ) తెలిపారు. చనిపోయిన 72 మందిలో 15 మంది కోల్కతాకు చెందిన వారేనని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు.
అంఫన్ తుఫాన్ తీరాన్ని తాకే ప్రక్రియ ( Landfall of Cyclone Amphan ) మొదలైంది. నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ప్రక్రియ మొదలవగా.. దాదాపు 4 గంటలపాటు సైక్లోన్ ల్యాండ్ ఫాల్ కొనసాగుతుందని ఒడిషాలోని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పికే జనా తెలిపారు. ఇప్పటికే పారాదీప్, కెండ్రపారా, ధమ్ర దాటేసిన అంఫాన్ తుఫాన్.. ప్రస్తుతం బాలాసోర్ను ( Balasore in Odisha ) ఆనుకుని ఉన్న తీరం వద్ద కొనసాగుతుందని అన్నారు.
కరోనా వైరస్ మనుషులు, జంతువులు, అన్ని రంగాలతో పాటు తాజాగా వాతావరణంపైనా ప్రభావం చూపిస్తోంది. కరోనా కారణంగా ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో కాస్తు ముందుగానే వర్షాలు కురవనున్నాయి.
నగర శివార్లతో పాటు రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల శనివారం సాయంత్రం భారీ వర్షం ( Heavy rain ) కురిసింది. ముఖ్యంగా మహేశ్వరం మండలంలోని గ్రామాలతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
బుధవారం సాయంత్రం కురిసిన అకాల వడగండ్ల వానకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు) మండలాలు చిగురుటాకులా వణికిపోయాయి. కెరమెరి మండలంలోని మహరాజ్గూడ, బాబేఝరి, పాటగూడ, శివగూడ పరిసర ప్రాంతాల్లో గంట పాటు ఏకధాటిగా కురిసిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.
తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాతావరణం మార్పు ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ శివార్లలోని పలు ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లా, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
దక్షిణ అండమాన్ సముద్రం నుంచి ఆగ్నేయ బంగాళాఖాతం వరకు అల్పపీడనం నిలకడగా కొనసాగుతోంది. మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్ నుంచి తూర్పు విదర్భ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.
ఆస్ట్రేలియాలో రాజుకున్న కార్చిచ్చుతో అల్లాడిన మూగజీవాలకు వర్షాలు రూపంలో ఉపశమనం లభించిందని ఆనందించేలోపే.. ఆ వర్షాలు కూడా వరదలుగా మారి ఇబ్బంది పెట్టేస్థాయికి చేరుకున్నాయి. మొన్నటివరకు అగ్ని కీలల నుంచి తప్పించుకోలేక తిప్పలు పడిన జంతువులకు తాజాగా వరదల నుంచి కూడా తిప్పలు తప్పడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.