Prakasam Barrage Gates Opened: ప్రకాశం బ్యారేజ్కు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ నిండుకుండను తలపిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. మొత్తం 70 గేట్లు 8 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Krishna Floods: నదీ పరివాహక ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం డ్యామ్ నిండుతోంది. డ్యామ్ గేట్లను పూర్తిగా తెరిచి..మొత్తం వరద నీటిని దిగువకు వదులుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. కృష్ణా నదికి ముంచుకొస్తున్న వరద నేపధ్యంలో గుంటూరు, కృష్ణా జిల్లాలు అప్రమత్తమవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ (TS) లో రెండు రోజులుగాఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) నీటిమట్టం 16.2అడుగులకు చేరింది. బ్యారేజీకి వరద నీరు భారీగా వస్తుండటంతో.. అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు.
కృష్ణా డెల్టాను పునరుద్ధరించడం..కృష్ణా నీటి సద్వినియోగం. ఈ రెండింటి లక్ష్యంతో కృష్ణా నదిపై మరో రెండు బ్యారేజ్ ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు బ్యారేజ్ లు ప్రకాశం బ్యారేజ్ కు దిగువన నిర్మితం కానున్నాయి.
కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగి ప్రకాశం బ్యారేజీకి ( Prakasam Barrage ) వరద నీరు పోటెత్తుతున్నందున విజయవాడ ( Vijayawada ) నగరవాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని విజయవాడ మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ( Prasanna Venkatesh ) సూచించారు.
కుటుంబకలహాలు భరించలేని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుందామని కృష్ణానదిలో దూకిన ఘటన బుధవారం విజయవాడలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ మహిళ, తన రెండేళ్ల కొడుకుతో సహా ఇంట్లోంచి వచ్చేసి ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.