Harish Rao Challenge: అసెంబ్లీలో జరిగిన పరిణామాలు తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా హరీశ్ రావు కావాలని కాళేశ్వరం నీళ్లు తీసుకురావాలని సవాల్ విసరగా.. ఆ సవాల్ను హరీశ్ రావు స్వీకరించారు. చేత కాకుంటే తప్పుకోమని సంచలన సవాల్ విసిరారు.
YS Sharmila Revanth Reddy Meet: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి పునఃప్రవేశించిన తర్వాత తొలిసారి మళ్లీ తెలంగాణలో వైఎస్ షర్మిల అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశం కావడం గమనార్హం.
Harish Rao Assembly Speech: తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశంలో కృష్ణా ప్రాజెక్టులపై చర్చ జరగ్గా అధికార, ప్రతిపక్షాల మధ్య ఒక యుద్ధమే జరిగింది. హరీశ్ రావు చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.
Telangana: సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. ఈసారి గతానికి కన్నా ఎక్కువ స్థానాలు సాధించడానికి 'పంచ వ్యూహం' రచించింది. రాష్ట్రవ్యాప్తంగా యాత్రల మీద యాత్రలు చేయాలని నిర్ణయించింది.
Bonthu Rammohan: అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. కీలక నాయకులంతా పార్టీని వీడుతున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన కీలక నాయకుడు ముఖ్యమంత్రిని కలిశారు.
Raithu Bandhu: రైతు పెట్టుబడులకు భరోసాగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధుపై కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈనేపథ్యంలో రైతు పెట్టుబడి రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Telangana Budget: కొత్తగా ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ బడ్జెట్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రజలకు ఆరు గ్యారంటీలు దక్కవని చెప్పారు. ప్రజలు వాటిపై ఆశలు పెట్టుకోవద్దని సూచించారు.
Rythu Bharosa: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ యజమానులకు భారీ షాకిచ్చింది. వ్యవసాయం చేయని భూ యజమానులకు పెట్టుబడి సహాయం విషయంలో ఆంక్షలు విధించింది.
Singareni Job Fair: తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటనలు ఊరిస్తున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించినా ఇంకా ఉద్యోగ ప్రకటనలు విడుదల కావడం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పోలీస్, గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటనలు వేస్తామని ప్రకటించారు.
KRMB Issue Telangana KCR: కృష్ణా జలాల అంశంపై మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న మాజీ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో గెలవలేక ఇలాంటి డ్రామాలకు తెరలేపారని ఒకప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో పని చేసిన జూపల్లి కృష్ణారావు విమర్శించారు.
Krishna Projects: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కృష్ణా జలాల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లతో తెలంగాణలో జల యుద్ధానికి తెరలేచింది. రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను మాజీ మంత్రి హరీశ్ రావు స్వీకరించి.. అసెంబ్లీలో చూసుకుందామని ప్రతి సవాల్ విసిరారు.
KCR Meeting With MLAs and MPs: మాజీ సీఎం కేసీఆర్ రీఎంట్రీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన గులాబీ బాస్.. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
Kamareddy: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధినేతలను ఓడించి సంచలనం రేపిన బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఏమైనా చేస్తానని చెబుతూ తన ఇంటినే కూల్చేసుకున్నారు. రోడ్డు నిర్మాణంలో అడ్డుగా ఉందని చెబుతూ తన ఇంటిని కూల్చారు.
BRS Parliamentary Meeting: ఎర్రవెల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం బీఆర్ఎస్ పార్టమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై దిశా నిర్దేశం చేశారు.
High Alert in BRS Party: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సమావేశం కావడం కలకలం రేపింది. ఈ సమావేశం గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. ఆ పార్టీలో చీలిక మొదలైందా..? కాంగ్రెస్తో టచ్లోకి వచ్చారా అనేది చర్చ జరుగుతోంది.
Didn't Expected Result: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలో లోక్సభ సెగ్మెంట్లవారీగా చేపట్టిన సన్నాహాక సమావేశాలు ముగిశాయి. చివరి రోజు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంపై సమావేశం నిర్వహించగా.. ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
BRS Working President KTR: మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో కంటే.. ప్రతిపక్షంలో ఉంటేనే చాలా డేంజర్ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫిబ్రవరి నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని చెప్పారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు.
Lok Sabha Elections 2024: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న బీఆర్ఎస్.. ఎంపీ ఎలక్షన్పై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో ఎలాగూ అధికారం కోల్పోయాం కానీ కేంద్రంలో మాత్రం పట్టు కోల్పోకూడదలన్న పట్టుదలతో ఉంది. ఇందుకోసం గెలుపు గుర్రాలను ఎన్నికల బరిలో దించేందుకు సిద్ధమవుతోంది. లెక్కలు బేరీజు వేసుకుంటూ ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న దానిపై గులాబీ బాస్ దృష్టి సారించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.