Dasoju Sravan: ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటన సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని పబ్లికి లిమిటెడ్ కంపెనీలా మార్చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తీరుతో కాంగ్రెస్ కు తీరని నష్టం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరడం ఖాయమైంది.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణ ఏర్పాటుతో బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు. కేసీఆర్ ను వదిలేది లేదని స్పష్టం చేశారు.
MUNUGODE BYELECTION: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో మునుగోడుకు త్వరలో ఉపఎన్నిక రాబోతోంది.మునుగోడు గడ్డ మొదటి నుంచి పోరాటాలకు కేంద్రంగా నిలిచింది. మొదటి నుంచి కమ్యూనిస్టుల కోట. వామపక్ష ఉద్యమాలకు ఊపిరిపోసింది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఇక్కడి నేతలు కీలకంగా వ్యవహించారు.
Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ ఆలయంలో మరోసారి ప్రోటోకాల్ వివాదం తలెత్తింది.కేంద్ర మంత్రులను ఆలయ ఈవో పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను యాదాద్రి నుంచి ప్రారంభించారు
Telangana BJP President Bandi Sanjay third Praja Sangrama Yatra starts from today. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మూడవ విడత 'ప్రజా సంగ్రామ యాత్ర' ఈరోజు నుంచి ప్రారంభం కానుంది.
Munugodu ByElection: తెలంగాణ రాజకీయాలు కొన్ని రోజులుగా ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. బీజేపీలో చేరితే ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తారని.. మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందనే చర్చ జరుగుతోంది.
Bandi Sanjay Yatra: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటి నుంచి సాగనుంది. ఈసారి యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం నుంచి వరంగల్ భద్రకాళి వరకు ఆలయం వరకు యాత్ర సాగనుంది. పాదయాత్రలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగనున్నారు బండి సంజయ్.
BJP Joinings: తెలంగాణలో ప్రస్తుతం ఆపరేషన్ ఆకర్ష్ నడుస్తోంది. ఇతర పార్టీల నేతలను ఆకర్షించి తమ పార్టీలో చేర్చుకునేలా అధికార, విపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. చేరికల కోసమే బీజేపీ, కాంగ్రెస్ లు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి.
BJP: దేశంలో కమలనాథులు స్పీడ్ పెంచారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని పావులు కదుపుతున్నారు. పాట్నాలో జరిగిన పార్టీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Telangana Politics: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి కనిపిస్తోంది. జోరుగా నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. అధికార ,విపక్షాలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తమ పార్టీలో ఉన్న నేతలను కాపాడుకుంటూనే.. ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరేలా పావులు కదుపుతున్నాయి.
ED TARGET KCR: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోంది. మోడీ-షా టీమ్ ఏదైనా రాష్ట్రంపై ఫోకస్ చేస్తే.. అక్కడ పూర్తిస్థాయిలో యాక్షన్ ఉంటుంది. టీఆర్ఎస్ ను ఓడించాలంటే కేసీఆర్ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలనే వ్యూహంలో కేంద్రం పెద్దలు ఉన్నారంటున్నారు.
Bandi Sanjay: తెలంగాణలో రాజకీయ వేడి హీట్ పుట్టిస్తోంది. మునుగోడు చుట్టే రాజకీయం తిరుగుతోంది. ఈక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Komatireddy: తెలంగాణ కాంగ్రెస్ తో పాటు రాష్ట్రంలో కాక రేపుతున్న సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో రాజకీయ రచ్చ కంటిన్యూ అవుతోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని ఆ పార్టీ అధ్యక్షుడు చెబుతుండగా... రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని సీఎల్పీ నేత తెలిపారు. దీంతో అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్.. మధ్యలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నట్లుగా సీన్ మారిపోయింది.
Komatireddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొన్ని రోజులుగా ఆయన బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా బుధవారం మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని చెప్పారు.
Bandi Sanjay: రాష్ట్రప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం జీవించే హక్కును కాలరాయడమేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.
Telangana Elections: తెలంగాణ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. ముందస్తు ఎన్నికల ప్రచారంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అన్ని పార్టీల్లోని సీనియర్ నేతలు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు, ఇక్కడే ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. చారిత్రాక, తెలంగాణ సాయుధ, ఉద్యమ పోరాటాల నేపథ్య ప్రాంతాల మీదుగా పాదయాత్ర సాగనుంది.
KTR TWEET: తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. దేశ, అంతర్జాతీయ సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. విపక్షాలను ఆ వేదిక నుంచే టార్గెట్ చేస్తుంటారు. కాని తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి థ్యాంక్స్ చెబుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు
Revanth Reddy: ఆదివారం కాంగ్రెస్ లో రెండు పోటా పోటీ సమావేశాలు జరుగుతుండటం కాక రేపుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లో పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆదివారమే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరో సమావేశం ఏర్పాటు చేశారు.
Revanth Reddy: తెలంగాణ రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాలో ఉన్న విపక్షాలు దూకుడుగా వెళుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ హైకమాండ్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేశాయి. ఆ పార్టీల అగ్రనేతలు తెలంగాణకు క్యూకడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.