గత కొద్దీ రోజులుగా అకాల వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలు చల్లబడ్డాయి కానీ ఈ రోజు నుండి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఎండలు దంచి కొట్టనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Cyclone Mocha live updates: ఈ అల్పపీడనం మోచా తూఫాన్గా మారుతున్న నేపథ్యంలో ఈ తుఫాన్ ఏ ప్రాంతంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందనే వివరాలను భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మోచా తుఫాన్పై వాతావరణ శాఖ నివేదక వివరాలు ఇలా ఉన్నాయి.
Cyclone Mocha Latest News: మోచ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఏపీ సర్కారు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని తీర ప్రాంతాల్లో జాలర్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
Manipur Violence News: అమరావతి: మణిపూర్ రాష్ట్రంలో గిరిజన తెగల మధ్య రిజర్వేషన్ విషయమై ఏర్పడిన ఘర్షణలు హింసాత్మక ఘర్షణలకు దారితీసిన సంగతి తెలిసిందే. మణిపూర్లో శాంతి భద్రతల సమస్య తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థుల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Nandigama Suresh : ఎంపీ నందిగామ సురేష్ మీడియాతో మాట్లాడారు. వర్షం వస్తే మునిగిపోయే చోట అంబేద్కర్ విగ్రహం పెట్టాడని చంద్రబాబు మీద కౌంటర్లు వేశాడు. అంబేద్కర్ మన దేవుడని భావించిన వైఎస్ జగన్ మాత్రం నగరం నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేశాడని అన్నాడు.
AP SSC Results 2023: ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు ఇవాళ విడుదల అయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్ని విడుదల చేసారు . ఈ ఫలితాల్ని ఎలా చెక్ చేసుకోవాలి, డైరెక్ట్ లింక్స్ వివరాలు మీ కోసం..
YSR Kalyanamastu Scheme, YSR Shaadi Thofa Scheme: జనవరి–మార్చి త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 12,132 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ. 87.32 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేడు శుక్రవారం సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
AP Govt's Good News to Farmers: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చేపట్టిన ఇతరత్రా చర్యలను అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి వివరించారు. రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా ముందుకు సాగుతోందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
AP Job Notifications: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ అందిస్తోంది. మరో మూడు నెలల వ్యవధిలో భారీగా ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఏయే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నారనే వివరాలు మీ కోసం..
Janasena About AP CM YS Jagan: సీఎం వైయస్ జగన్ రోడ్డు మీదకు వస్తే చాలు బయటికి కనిపించకుండా పరదాలు కట్టించుకోవడం, దుకాణాలు మూసివేయడం లాంటి ప్రజా వ్యతిరేక చర్యలు చూస్తోంటే ముఖ్యమంత్రి రాన్రాను అభద్రతాభావం మరింత ఎక్కువైపోతోందని అనిపిస్తోందని నాదెండ్ల అనుమానం వ్యక్తంచేశారు.
Cyclone Mocha News: భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీ కూడా తూర్పు తీర రాష్ట్రమే కావడంతో రైతులను, తీర ప్రాంత వాసులను మోచా తుపాన్ ముప్పు భయం పట్టుకుంది. ఇప్పటికే అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని.. ఇప్పుడు ఈ తుపాన్ రాకతో ఇంకేం జరగనుందో అని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
YS Viveka Murder Case : మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద హత్య కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న వాచ్ మెన్ రంగన్నకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్తమాతో బాధపడుతున్న ఆయన్ను పులివెందుల నుంచి తిరుపతి ఆస్పత్రికి తరలించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్, మే నెలల్లో ఎండలు అధికంగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం అధిక వర్షాల కారణంగా వాతావరణం చల్ల బడటంతో ఊపిరి పీల్చుకున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇలా మరో రెండు భారీ వర్షాలు ఉండటంతో రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు.
Minister Roja Interesting Comments on Her Life: అమ్మను చూసుకోని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడని ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు తన అవసరం కోసం అదే ప్రధానిని ప్రసన్నం చేసుకునేందుకు పాకులాడుతున్నాడని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారని.. చంద్రబాబు నాయుడును ప్రజలు ఎప్పుడో దూరం పెట్టినా ఇంకా ఆయనకి బుద్ది రావడం లేదని మంత్రి రోజా అసహనం వ్యక్తంచేశారు.
Rajini vs Ysrcp: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఏపీలో వేడి పుట్టించాయి. సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య వైరాన్ని సృష్టించాయి. రజనీ కాంత్ అభిమానులు వర్సెస్ వేసీపీ నేతల వార్కు దారి తీస్తోంది.
Rajinikanth About NTR: విజయవాడలో జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలకు హాజరైన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ఎన్టీఆర్తో తనకున్న అనుబంధాన్ని,జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
AP Weather Report: రానున్న నాలుగు రోజులు పాటు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురువనుండటంతో వాతావరణం కొంత చల్లబడి, ఇప్పటివరకు నమోదైన అధిక ఉష్ణోగ్రతలు కొంతమేరకు తగ్గనున్నాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.
Chandrababu Naidu : అబద్దాల కోరు సీఎం జగన్ను రానున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని బంగాళాఖాతంలో కలిపేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ పరిగెడుతుందని ప్రజల్లో ఉత్తేజాన్ని నింపాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.