Rape On Buffalo: ఎవడ్రా వీడు పశువుపై పైశాచికం.. గేదెపై అత్యాచారం

Man Sexual Assaulted On Buffalo After Drunk At East Godavari District Of Andhra Pradesh: కామం మైకంలో ఓ వ్యక్తి బరి తెగించాడు. మనుషులను వదిలేసి జంతువులపై విరుచుకుపడ్డాడు. పాకలో కట్టేసిన గేదెపై తన కోరికను తీర్చుకున్న ఘోర సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 17, 2024, 03:18 PM IST
Rape On Buffalo: ఎవడ్రా వీడు పశువుపై పైశాచికం.. గేదెపై అత్యాచారం

Sexual Assault On Buffalo: లైంగిక వాంఛలో ఉన్న ఓ వ్యక్తి పశువు కన్నా హీనంగా ప్రవర్తించాడు. కామం మైకంలో ఎవరూ అని కూడా చూడలేదు. కనిపించింది మనిషా.. జంతువా అని కూడా చూడకుండా రెచ్చిపోయాడు. పశువుల పాకలో కట్టేసిన గేదెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గేదెను తాళ్లతో కట్టేసి తీవ్రంగా దాడి చేశాడు. అయితే అతడి దాడిని ప్రతిఘటించడంతో ఘర్షణ తలెత్తింది. అతడి కామ క్రీడలో గేదెకు గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘోర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read: Tragic Incident: వరదలతో తెగిన అన్నాచెల్లెలి అనుబంధం.. మృతదేహాన్ని 5 కి మీ మోసుకెళ్లిన అన్నలు

పోలీసులు, బాధిత రైతు చెప్పిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి గ్రామానికి రైతు పిల్లి సీతారామయ్య పాడి వ్యాపారం చేస్తున్నాడు. పశువుల పాకలో గేదెలను పోషిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. జూలై 3వతేదీన రాత్రి ఓ నిందితుడు పశువుల కొట్టంలోకి చేరుకున్నాడు. అక్కడ కట్టేసిన గేదె వద్దకు వచ్చి దాన్ని పడగొట్టి కదలకుండా కాళ్లను బంధించాడు. బలవంతంగా గేదెపై అత్యాచారం చేశాడని రైతు సీతారామయ్య తెలిపారు. అతడి దాడిలో గేదే ప్రతిఘటించిందని.. గేదె శరీరంపై గోరు గాట్లు ఉన్నాయి.

Also Read: Watchman Suicide: చిట్టీ డబ్బుల కోసం దంపతుల వేధింపులు.. కరెంట్‌ ఫ్యూజ్‌ పట్టుకుని వాచ్‌మెన్‌ ఆత్మహత్య

గేదెపై జరిగిన దారుణాన్ని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ వ్యవహారంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో గేదెపై జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన రోజు వ్యవసాయ బావి సమీపంలో మద్యం సీసాలు కనిపించాయని రైతు తెలిపాడు. ఆ సీసాలను మీడియాకు, పోలీసులకు చూపించారు సీతారామయ్య. రైతు మొర విన్న కలెక్టర్ పోలీసులు, పశువుల వైద్యులకు ఆదేశించారు. డాక్టర్‌తో కలిసి ఘటనా స్థలికి వచ్చి గేదెను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఘటన జరిగిన తెల్లవారుజామున రైతు రోజు మాదిరి పశువుల కొట్టానికి చేరుకుని గేదెను పనికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. గేదెను మేతకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా లేవలేదు. నడవలేని పరిస్థితిలో ఉండడంతో వెంటనే వెటర్నరీ డాక్టర్‌ను సంప్రదించారు. వైద్యుడు వచ్చి గేదెను పరిశీలించి దానిపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. భీమవరంలో ఉండే తన కుమారుడికి రైతు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు.

ఆలస్యంగా వెలుగులోకి?
ఈనెల 7వ తేదీన స్వగ్రామం చేరుకున్న కుమారుడు గేదె సంఘటనపై తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారం గడిచినా పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో రైతుతోపాటు అతడి కుమారుడు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. కలెక్టర్‌ ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఏపీలో అత్యాచార సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్న సమయంలో ఇప్పుడు పశువుపై జరగడం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఈ సంఘటనలు మరింత పెరగడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News