భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ కు వర్షం  ముప్పు ..వరణుడు కరుణించేనా ?

యుద్దాన్ని తలపించే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మరి కొన్ని గంటల్లో ప్రారంభంకానుంది

Last Updated : Jun 16, 2019, 12:52 PM IST
భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ కు వర్షం  ముప్పు ..వరణుడు కరుణించేనా ?

వరల్డ్ కప్ లీగ్ మ్యాచుల్లో భాగంగా మంచెస్ట‌ర్‌ వేదికగా మరికొన్ని గంటల్లో అసలైన పోరు మొదలు కానుంది. యుద్ధాన్ని తలపించే భారత్-పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. మంచి ఫాంలో ఉన్న కోహ్లీసేన ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. మరోవైపు పాక్ పరిస్థితి అందుకు భిన్నం. ఆటగాళ్లు ఫాంలో లేక తెగ ఇబ్బందుతున్నారు. ఏ యాంగిల్ లో చూసినా భారత్ దే పై చేయి. అయితే ఈ సందర్భంగా భారత్ కు ఓ విషయం మాత్రం తెగ కలవడరపెడుతోంది. అదే వరణుడి భయం.

ఇంగ్లండ్‌ను వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్ప‌టికే ఈ ప్ర‌పంచ క‌ప్పులో నాలుగు మ్యాచులు వ‌ర్షార్ప‌ణం అయిపోయాయి. ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ కూడా ఇందులో ఒక‌టి. కివీస్ మ్యాచ్ పోయినా ప‌ర్లేదు కానీ పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఇలాగే వ‌ర్షానికి బ‌లైపోతే ఎలా అనే టీమిండియాకు బెంగ పట్టుకుంది. ఆదివారం కూడా భారీ వ‌ర్షాలు ఉంటాయ‌ని ఇప్ప‌టికే ప్రముఖ వాతావరణ సంస్థ విండి వెబ్ సైట్ వెల్ల‌డించింది.  ఒక వేళ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ గానీ వ‌ర్షార్ప‌ణం అయిపోయిందంటే వ‌రల్డ్ క‌ప్ క‌ళ త‌ప్ప‌డం ఖాయం. 

Trending News