School van catches fire : స్కూల్ వ్యానుకు మంటలు.. నలుగురు విద్యార్థుల మృతి!

చిన్నారులను పాఠశాలకు తీసుకెళ్లే స్కూల్ వ్యానుకు నిప్పంటుకోవడంతో అందులో ప్రయాణిస్తోన్న వారిలో నలుగురు విద్యార్థులు మృత్యువాత పడిన దుర్ఘటన పంజాబ్‌లోని సంగ్రూర్‌కి సమీపంలోని లొంగోవాల్ పట్టణంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

Last Updated : Feb 15, 2020, 05:18 PM IST
School van catches fire : స్కూల్ వ్యానుకు మంటలు.. నలుగురు విద్యార్థుల మృతి!

న్యూ ఢిల్లీ: చిన్నారులను పాఠశాలకు తీసుకెళ్లే స్కూల్ వ్యానుకు నిప్పంటుకోవడంతో అందులో ప్రయాణిస్తోన్న వారిలో నలుగురు విద్యార్థులు మృత్యువాత పడిన దుర్ఘటన పంజాబ్‌లోని సంగ్రూర్‌కి సమీపంలోని లొంగోవాల్ పట్టణంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. చనిపోయిన విద్యార్థులంతా 4-5 ఏళ్ల మధ్య వయస్సున్న వారే. ఇదే ఘటనలో మంటల్లో చిక్కుకున్న మరో 8 మంది విద్యార్థులను అక్కడి స్థానికులు కాపాడారు. ఘటనాస్థలికి సమీపంలోని పొలాల్లో పనిచేసుకుంటున్న కూలీలు వ్యానుకు మంటలు అంటుకోవడాన్ని గుర్తించి హుటాహుటిని అక్కడికి చేరుకుని 8 మంది విద్యార్థులను కాపాడారు. 

వ్యానుకు మంటలు అంటుకోవడానికి కారణం ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

Trending News