Vishwambhara: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్.. మూడు ఇండస్ట్రీల నుంచి ముగ్గురు

Chiranjeevi: చిరంజీవి బింబిసార దర్శకుడు వశిష్టాతో చేస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి తదుపరి ప్రాజెక్టులోని హీరోయిన్ గురించి వస్తున్న రూమర్స్ అందరిలో ఆసక్తి రేపుతున్నాయి…

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2024, 08:30 PM IST
Vishwambhara: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్.. మూడు ఇండస్ట్రీల నుంచి ముగ్గురు

Deepika Padukone: చిరంజీవి కమ్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఆయన రేంజ్ సినిమా ఇప్పటివరకు రాలేదని చెప్పాలి. ఈ మధ్య వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ సక్సెస్ సాధించిన ఆ చిత్రం కథ కూడా చాలా సాధారణమైనదే. ఇక ఖైదీ నెంబర్ 150 నుంచి ప్రస్తుతం వరకు చిరంజీవి చేసిన సినిమాలు ఏవి.. ఆయన ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అయితే పెట్టలేదు. ఈ నేపథ్యంలో మన మెగాస్టార్ బింబిసార దర్శకుడు వశిష్టత చేస్తున్న సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

అందుకు ముఖ్య కారణం బింబిసార లాంటి సోషియో ఫాంటసీ సినిమాని వశిష్ట చాలా చక్కగా తీర్చిదిద్దడంతోపాటు ఇప్పుడు మెగాస్టార్ తో తీస్తున్న సినిమా కూడా సోషియో ఫాంటసీ లైన్ పైనే.. తెరకెక్కిస్తూ ఉండడం. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 

ఈ చిరంజీవి చిత్రం కోసం మేకర్స్ ఏకంగా రూ. 200 కోట్ల పైగా ఖర్చు చేయనున్నారని సమాచారం. ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఈ చిత్రం ఈ సంవత్సరంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి ఈ విశ్వంభర అనే టైటిల్ ను ఖరారు చేశారు సినిమా టీమ్. ఇక ఈరోజు సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్ కూడా అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ముల్లోకాల కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు అంటూ రూమర్ కూడా గట్టిగా వినిపిస్తోంది.

అయితే ఈ ఈ చిత్రంలో హీరోయిన్స్ గురించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. నిన్న మొన్నటి వరకు నయనతారా ను హీరోయిన్ గా ఫిక్స్ చేసేందుకు చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలానే త్రిష కూడా ఈ సినిమాలో ఉన్నట్టు గట్టిగా వినిపిస్తోంది. కాగా ఇప్పుడు మరో వార్త హల్చల్ చేస్తోంది. చిరంజీవి సరసన నటించడానికి ఏకంగా బాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ దీపికా పదుకునే ను రంగంలోకి దింపేందుకు చిత్ర బృందం రెడీ అయిందట. ఈ మేరకు దీపికతో చిత్ర బృందం చర్చలు కూడా చేసిందట. దానికి దీపిక పదుకునే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త సినీ వర్గాల్లో హల్చల్ చేస్తుంది. 

ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో హీరోయిన్ ను తీసుకుంటే ప్రమోషన్ పరంగా సహాయపడుతుందని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే బాలీవుడ్ నటి దీపికా పదుకుణెను మూవీ టీం సంప్రదించినట్టు సమాచారం. మరి మిగతా ఇద్దరు హీరోయిన్లుగా నయనతార.. త్రిషా అని ఫిక్స్ చేస్తారు లేకపోతే మరెవరినన్నా సంప్రదిస్తారో తెలియాల్సి ఉంది. 

Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News