Jio users down: జియోకు షాకిచ్చిన యూజర్లు.. భారీగా పడిపోయిన యూజర్ల సంఖ్య!

Jio users down: టెలికాం యూజర్ల సంఖ్య 2021 డిసెంబర్​లో భారీగా పడిపోయింది. రిలయన్స్, వొడాఫోన్ ఐడియా యూజర్లను భారీగా కోల్పోవడం ఇందుకు కారణంగా ట్రాయ్​ డేటాలో వెల్లడైంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2022, 10:59 PM IST
  • డిసెంబర్​లో తగ్గిన టెలికాం యూజర్లు
  • రిలయన్స్​కు భారీగా తగ్గిన సబ్​స్క్రైబర్లు
  • ఎయిర్​టెల్​కు పెరిగిన యూజర్ల సంఖ్య
Jio users down: జియోకు షాకిచ్చిన యూజర్లు.. భారీగా పడిపోయిన యూజర్ల సంఖ్య!

Jio users down: గత ఏడాది చివరి నెలలో దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్ల సంఖ్య  భారీగా తగ్గింది. 2021 డిసెంబర్​లో టెలికాం యూజర్ల సంఖ్య అంతకు ముందు నెల(నవంబర్​)తో పోలిస్తే 1.28 కోట్లు తగ్గినట్లు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్​) ఇటీవల విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా అత్యధిక యూజర్లను కోల్పోగా.. ఎయిర్​టెల్​ స్వల్పంగా కొత్త యూజర్లను సాధించినట్లు తాజాగ విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. దీనితో దేశవ్యాప్తంగా మొత్తం వైర్​లెస్​ నెట్​వర్క్ యూజర్ల సంఖ్య 115.46 కోట్లకు తగ్గిందని పేర్కొంది ట్రాయ్​. 2021 నవంబర్​లో మొత్తం వైర్​లెస్ టెలికాం యూజర్ల సంఖ్య 116.74  కోట్లుగా ఉండటం గమనార్హం.

జియోకు తగ్గిన యూజర్లు..

2021 డిసెంబర్​లో రిలయన్స్ జియో 1.29 కోట్ల యూజర్లను కోల్పోయినట్లు ట్రాయ్​ డేటాలో తేలింది. దీనితో జియో యూజర్ల సంఖ్య 41.57 కోట్లకు తగ్గింది. అయినప్పటికీ దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా రిలయన్స్ జియోనే ఉండటం గమనార్హం.

వొడాఫోన్ ఐడియాది అదే బాట..

2021 డిసెంబర్​లో 16.14 లక్షల మంది వొడాఫోన్​ ఐడియా నెట్​వర్క్​ను వీడారు. దీనితో డిసెంబర్​ నాటికి వొడాఫోన్ ఐడియా మొత్తం వినియోగదారుల సంఖ్య 26.55 కోట్లకు దిగొచ్చిందని ట్రాయ్​ వివరించింది.

స్వల్పంగా పెరిగిన ఎయిర్​టెల్​ యూజర్లు..

ఇక దేశంలో రెండో అతిపెద్ద టెలికాం  సంస్థ అయిన భారతీ ఎయిర్​టెల్​ 2021 డిసెంబర్​లో 4.75 లక్షల మంది కొత్త యూజర్లను రాబట్టింది. దీనితో ఎయిర్​టెల్ యూజర్ల సంఖ్య 35.57 కోట్లకు పెరిగింది.

మార్కెట్ షేర్ పరంగా చూస్తే.. 2021 డిసెంబర్​ చివరి నాటికి ఎయిర్​టెల్​ మార్కెట్​ వాటా 30.43 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో వొడాఫోన్​ ఐడియా మార్కెట్ వాటా 23 శాతానికి చేరింది. ఇక జియో మార్కెట్ వాటా కాస్త తగ్గినప్పటికీ.. 36 శాతంతో మార్కెట్ లీడర్​గా ఉండటం గమనార్హం.

బ్రాడ్​ బ్యాండ్ యూజర్లలోనూ క్షీణత..

మరోవైపు దేశవ్యాప్తంగా బ్రాండ్​ బ్యాండ్ వినియోగదారుల్లోనూ క్షీణత నమోదైందని ట్రాయ్​ పేర్కొంది. ముఖ్యంగా 2021 డిసెంబర్​లో మొత్తం బ్రాడ్​ బ్యాండ్ యూజర్ల సంఖ్య 79.2 కోట్లకు తగ్గిందని తెలిపింది. 2021 నవంబర్​లో ఈ సంఖ్య 80.1 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది ట్రాయ్​.

ఇక మొత్తం బ్రాడ్​ బ్యాండ్​ మార్కెట్​లో టాప్​ 5లో ఉన్న కంపెనీలే 98.54 శాతం వాటాను కలిగి ఉన్నట్లు ట్రాయ్​ వివరించింది.

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్​ లిమిటెడ్​ 42 కోట్ల యూజర్లను, భారతీ ఎయిర్​టెల్​ 21 కోట్ల యూజర్లను, వొడాఫోన్ ఐడియా 12.2 కోట్ల యూజర్లను, బీఎస్​ఎన్​ఎల్​ 2.5 కోట్ల యూజర్లను కలిగి ఉన్నాయని ట్రాయ్​ డేటాలో తేలింది.

Also read: iPhone 12: ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​లో ఐఫోన్​ 12పై భారీ డిస్కౌంట్​- పూర్తి వివరాలివే..

Also read: Meta Facebook Services: ఇండియాలో ఎక్స్‌ప్రెస్ సేవల్ని నిలిపివేసిన ఫేస్‌బుక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News