కీలక సమయంలో వైసీపీ హ్యాండ్ ఇచ్చింది - సుజనచౌదరీ

                                              

Last Updated : Jul 19, 2018, 11:22 AM IST
కీలక సమయంలో వైసీపీ హ్యాండ్ ఇచ్చింది - సుజనచౌదరీ

టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరీ వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ప్రెస్ మీట్ లో సుజనా మాట్లాడుతూ ఏపీ ప్రజలకు వైసీపీ మోసం చేసిందని ఆరోపించారు. ఏపీకి ద్రోహం చేసిన మోడీ సర్కార్ పై టీడీపీ అవిశ్వాసం పెడితే దేశంలో ఉన్న విపక్షాలన్నీ మనకు మద్దతు ఇవ్వగా ఇంట్లో ఉన్న పార్టీ  (వైసీపీ) దూరంగా ఉండటం సిగ్గుచేటని విమర్శించారు.  ఇటు లోక్ సభకు ఎన్నికైన ఎంపీలు రాజీనామాల డ్రామా ఆడితే.. ఇటు రాజ్యసభలో ఉన్న ఇద్దరు సభ్యులు అవిశ్వాసం తీర్మానం సమయంలో జాడ లేకుండా పోయారని సుజనా చౌదరీ మండిపడ్డారు. 

రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటం కీలక దశకు చేరుకున్న ఈ సమయంలో వైసీపీ ఎంపీలు హ్యాండ్ ఇచ్చారని విమర్శించారు. బీజేపీతో వైసీపీ లాలూచీ పడిన విషయం ఇక్కడ తేటతెల్లమైందన్నారు . వైసీసీ సహకారం లేకుండానే హామీలను నెరవేర్చని కేంద్ర ప్రభుత్వాన్ని చర్చ సందర్భంగా నిలదీస్తామని సుజనా చౌదరీ ధీమా వ్యక్తం చేశారు.

 

Trending News