AP Corona cases: ఏపీలో కొవిడ్​ కల్లోలం- రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు

AP Corona cases: ఏపీలో కరోనా కేసులు మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. యాక్టివ్ కొవిడ్​ కేసులు 83 వేల మార్క్ దాటాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2022, 05:47 PM IST
  • రాష్ట్రంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు
  • క్రితం రోజుతో పోలిస్తే టెస్టుల్లోనూ వృద్ధి
  • 83 వేలు దాటిన యాక్టివ్​ కేసుల సంఖ్య
AP Corona cases: ఏపీలో కొవిడ్​ కల్లోలం- రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు

AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 14,440 మందికి కరోనా పాజిటివ్​గా​ (Corona cases in AP) తేలినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం ప్రకటించింది.

శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 46,650 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది ఆరోగ్య విభాగం. క్రితం రోజుతో పోలిస్తే శాంపిళ్లు సంఖ్య కాస్త పెరిగింది.

ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,969 మంది కొవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 20,82,482 మంది కరోనాను జయించారు.

ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా రాష్ట్రంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర (Corona deaths in AP) ఆరోగ్య శాఖ వివరించింది. విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం, గుంటూరులో ఒక్కరు చొప్పున మరణించినట్లు తెలిపింది.

ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,542 మంది కొవిడ్​కు బలయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 83,610 యాక్టివ్ కరోనా (Corona Active cases in India) కేసులున్నాయి.

జిల్లాల వారీగా యాక్టివ్ కేసులు..

విశాఖపట్నంలో అత్యధికంగా 15,695 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు తెలిపింది ఆరోగ్య విభాగం. ఆ తర్వాత చిత్తూరులో 11,047 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. పశ్చిమ గోదావరిలో అత్యల్పంగా 1,943 యాక్టివ్​ కరోనా కేసులు ఉన్నాయి. మిగతా అన్ని జిల్లాలలో మూడు వేలకుపైనే యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య విభాగం డేటాలో వెల్లడైంది.

ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 3,21,47,031 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 2,180,634 శాంపిళ్లు పాజిటివ్​గా తేలినట్లు వివరించింది.

Also read: Vizag Steel Plant: ఫిబ్రవరి 23న రాష్ట్ర బంద్‌.. మళ్లీ కదం తొక్కనున్న విశాఖ ఉక్కు కార్మికులు

Also read: Volunteers Insurance: సొంత ఖర్చుతో వాలంటీర్లకు ప్రమాద భీమా కల్పించిన ఎమ్మెల్యే రాజా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News