New Corona Virus: ఇది మరీ డేంజర్..తస్మాత్ జాగ్రత్త

కరోనా వైరస్ ( Corona virus ) మరింత డేంజర్ గా మారుతోంది. ఓ వైపు మహమ్మారిని కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతుండగానే..మరోవైపు వైరస్ ప్రమాదకర రూపం దాలుస్తోంది. మలేషియాలో వెలుగుచూసిన కొత్త కరోనా వైరస్ ఇప్పుడు భయం గొలుపుతోంది. 

Last Updated : Aug 17, 2020, 02:05 PM IST
New Corona Virus: ఇది మరీ డేంజర్..తస్మాత్ జాగ్రత్త

కరోనా వైరస్ ( Corona virus ) మరింత డేంజర్ గా మారుతోంది. ఓ వైపు మహమ్మారిని కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతుండగానే..మరోవైపు వైరస్ ప్రమాదకర రూపం దాలుస్తోంది. మలేషియాలో వెలుగుచూసిన కొత్త కరోనా వైరస్ ఇప్పుడు భయం గొలుపుతోంది. 

కరోనా వైరస్ ప్రపంచదేశాల్ని వణికిస్తోంది. ఓ వైపు వ్యాక్సిన్ ( Vaccine ) కోసం మరోవైపు మందు కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో వైరస్ లో కూడా పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులే ఇప్పుడు భయం గొలుపుతున్నాయి. మలేషియా ( Malaysia ) లో వెలుగుచూస్తున్న కొత్త రకం కరోనా వైరస్ ( New corona virus ) ప్రపంచదేశాలకు సవాలు విసురుతోంది. 

మలేషియాలోని ఓ రెస్టారెంట్ నుంచి ప్రారంభమైన క్లస్టర్ లో 45 కేసులు వెలుగుచూశాయి. ఇందులో మూడు కేసులు చాలా విభిన్నంగా ఉన్నాయి. ఈ మూడు కేసుల్లో కొత్త రకం కరోనా వైరస్ ను కనుగొన్నారు. ఇది ప్రస్తుతం ఉన్న వైరస్ కంటే 10 రెట్లు  ( 10 times more danger ) అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్..అత్యంత వేగంగా వ్యాప్తి చెందేలా రూపాంతరం చెందినట్టు తెలుస్తోందని అమెరికాకు చెందిన ప్రముఖ వైరాలజీ నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ( Dr Anthony fauci ) హెచ్చరించారు. Also read: Donald Trump: కమలా హ్యారిస్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

ఈ కొత్త రకం వైరస్ కు డీ 614 గా ( new virus named as D614 ) పేరు పెట్టారు. ఈ వైరస్ ప్రారంభమైన రెస్టారెంట్ యజమాని ఇండియా నుంచి మలేషియాకు వచ్చిన తరువాత క్వారెంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించడంతో వరుసగా 45 కేసులు వెలుగుచూశాయి. క్వారెంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించిన నేరానికి రెస్టారెంట్ యజమానికి మలేషియా ప్రభుత్వం 5 నెలల జైలు శిక్ష, జరిమానా విధించింది. కరోనా వైరస్ పరివర్తనకు గురవుతున్నట్టు బ్లూమ్ బర్గ్ ( Bloomberg report ) నివేదిక వెల్లడించింది. ఈ కారణంగా వ్యాక్సిన్ల అభివృద్ధికై ఇప్పటివరకూ ఉన్న అధ్యయనాలు అసంపూర్తిగా లేదా అసమర్ధంగా ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటు ఫిలిప్పీన్స్ నుంచి తిరిగొచ్చినవారిలో కూడా ఈ కొత్త వైరస్ ను కనుగొన్నట్టు తెలిసింది. 

వాస్తవానికి చైనాలోని వుహాన్ ( Wuhan ) లో తొలిసారి కరోనా వైరస్ వెలుగుచూసినప్పటి నుంచి ఇప్పటి వరకూ వైరస్ మ్యూటేషన్ చెందడం గమనించారు. కానీ మలేషియాలో వెలుగుచూసిన కొత్తరకం మాత్రం అత్యంత ప్రమాదకరంగా ఉందని చెబుతున్నారు. Also read: Dogs to Sniff Out COVID19: కోవిడ్19 నిర్ధారణకు కుక్కలు రిక్రూట్.. ఎక్కడంటే?

Trending News