బీజేపీ నేత రాజాసింగ్ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ !

                      

Last Updated : Oct 8, 2018, 06:44 PM IST
బీజేపీ నేత రాజాసింగ్ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ !

హైదరాబాద్:  బీజేపీ ఫైర్ బ్యాండ్  నేత, గోషా మహల్ తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫేస్ బుక్ ఖాతా హ్యాకింగ్ కు గురైంది. సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ రఘువీర్ ను కలిసి రాజాసింగ్ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ కుట్రపూరితంగా తన ఫేస్ బుక్  ఖాతా హ్యాక్ చేశారని ఆరోపించారు.  గతంలో కూడా తన ఫేస్ బుక్ ఖాతా, వైబ్ సైట్ ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదని..ఈ క్రమం మళ్లీ ఆదివారం రోజు హ్యాక్ చేసినట్లు గుర్తించానని తెలిపారు. హ్యాకర్ల వివరాలు ఇంకా తెలియరాలేదు.. బయటి దేశంలో ఉండి ఈ పనిచేసినట్లు తెలిసిందన్నారు. ఈ విషయంలో మంగళహాట్ పోలీస్ స్టేషన్ లో కూడా తాను కంప్లైట్ చేశామని..ఎవరైనా  తన ఫేస్ బుక్ ద్వారా తప్పుడు సందేశం వేస్తే దానికి తాను బాధ్యుడిని కానని ఈ సందర్భంగా రాజాసింగ్ తెలిపారు

ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర..
తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా తనకు 5 లక్షల పాలోవర్స్ ఉన్నారని ఆ సందర్భంగా రాజాసింగ్ తెలిపారు. తన ప్రతిష్ఠ ఎదో రకంగా దెబ్బతీశాయాలని భావిస్తున్న ప్రత్యర్ధులు.. ఇలా దొడ్డిదారిన తన ఫేస్ బుక్ అకౌంట్ ను హ్యాక్ చేశారని విమర్శించారు. గోషామహల్ స్థానంలో తనును ఓడించేందుకు ఎంఐఎం సహా అన్ని పార్టీలు కలిసి కుట్రపన్నాయని.. అందులో భాగంగానే తన ఫేస్ బుక్ హ్యాక్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్నికుట్రలు పన్నినా ప్రజా క్షేత్రంలో తనను ఓడించలేరని ఆ సందర్భంగా  రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు.

Trending News