బర్త్ డే పార్టీ ఎఫెక్ట్: 45 మందికి సోకిన కరోనా

గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుందన్న క్రమంలో మళ్ళీ ఒక్కసారిగా విజృంభించింది. కాగా తెలంగాణ రాష్ట్రంలో నమోదువుతున్న కరోనా కేసుల్లో అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనివే.

Last Updated : May 10, 2020, 04:49 PM IST
బర్త్ డే పార్టీ ఎఫెక్ట్: 45 మందికి సోకిన కరోనా

హైదరాబాద్: గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుందన్న క్రమంలో మళ్ళీ ఒక్కసారిగా విజృంభించింది. కాగా తెలంగాణ రాష్ట్రంలో నమోదువుతున్న కరోనా కేసుల్లో అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనివే. ముఖ్యంగా, వనస్థలిపురం పరిసర ప్రాంతాల్లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. అయితే ఈ క్రమంలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో 45 మంది ఎల్బీనగర్ ప్రాంతానికి చెందినవారేనని, వీరందరు ఇటీవల ఓ షాప్ యజమాని పుట్టిన రోజు వేడుకలు వేడుకలు నిర్వహించడమే వైరస్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్నారు. కొత్త కేసులు నమోదు కావడంతో పాటు ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో 15 కంటైన్మెంట్ క్లస్టర్లు కూడా ఏర్పడ్డాయి.

జన్మదిన వేడుకలకై గుమిగూడడంతో అందరికి వ్యాప్తి చెందిందని కాగా వ్యాపారికి తన దుకాణంలో పనిచేసే వ్యక్తి ద్వారా కరోనా సోకిందని ఈ విషయం తెలియక పార్టీలో పాల్గొనడంతో అతడి మిత్రుడికి కూడా కరోనా వ్యాప్తి చెందింది. ఆ విధంగా మొత్తం 45 మంది కరోనా బారినపడ్డట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో రెండు కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించగా ప్రస్తుతం వాటి సంఖ్య మరింత పెరిగింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News