Congress-Ysrtp Merger: తెలంగాణ ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. పార్టీల మధ్య పొత్తులు లేదా విలీన ప్రక్రియకు తెరలేచే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో వైఎస్సార్టీపీ గురించి చర్చ నడుస్తోంది.
YSRTP, Congress Merger News: తాజాగా వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం అంశం మరోసారి తెరపైకొచ్చింది. పార్టీ విలీనం ఇక తుది అంకానికి చేరుకున్నట్టే అని రాజకీయ వర్గాలు భావిస్తున్న సమయంలోనే వైఎస్ షర్మిల తన ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్నారు. వైఎస్ షర్మిల హైదరాబాద్ వచ్చీ రావడంతోనే ఆమెని చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులు ఇదే విషయమై ఆరా తీశారు.
Crop Loan Waiver Scheme in Telangana: రాష్ట్రంలో నిధుల కొరత లేదని ఇన్నాళ్లు గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్.. రుణ మాఫీ చేయడానికి మాత్రం కరోనా అడ్డు వచ్చిందని చెప్పడం విడ్డూరంగా ఉందని వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
YS Sharmila Slams CM KCR: వర్షాలు, వరదలతో రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. సీఎం కేసీఆర్ పట్టించుకోవట్లేదని వైఎస్ షర్మిల అన్నారు. వర్షాలు తగ్గిపోయిన తరువాత వచ్చి హెలికాఫ్టర్లో చక్కర్లు కొట్టి.. ఇంటికి పది వేలు, పంటకు పదివేలు అనే ప్రకటనలు ఇస్తాడని జోస్యం చెప్పారు.
YS Sharmila on Telangana Debts: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై వైఎస్ షర్మిల ఆరోపణలు గుప్పించారు. ధనిక రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ధన దాహానికి సీఎం కేసీఆర్ బలి చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నిలదీశారు.
YS Sharmila on Aarogyasri Scheme: ఆసుపత్రులకు పెండింగ్లో ఉన్న రూ.800 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. 9 ఏళ్లుగా ఆరోగ్యశ్రీని అమలు చేయకుండా.. లక్షల మంది ప్రాణాలు తీసిన పాపం కేసీఆర్దే అంటూ ఘాటు విమర్శలు చేశారు.
YS Sharmila on CM KCR: సీఎం కేసీఆర్పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు మాట మీద నిలబడే దమ్ముంటే.. ముందు రుణమాఫీ చేసి చూపించాలని డిమాండ్ చేశారు. రుణ మాఫీ పేరుతో రైతులకు బూటకపు హామీ ఇచ్చారని ఫైర్ అయ్యారు.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆమె కాంగ్రెస్లో చేరబోతున్నారా..? రాజకీయంగా తెలంగాణలో ఉంటారా..? ఏపీలో ఉంటారా..? అనేది చర్చనీయంశంగా మారింది.
YS Sharmila to KCR: 10 ఏళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ దొర అమలు చేసిన ఏ పథకం చుసినా.. "అర్హుల పొట్ట కొట్టు, బందిపోట్లకు పెట్టు" అన్నచందంగానే ఉంటోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. పేదలకు దక్కాల్సిన అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు అన్నీ బీఆర్ఎస్ పార్టీ దొంగల పాలవుతున్నాయ్ అని మండిపడ్డారు.
కేసీఆర్ పుట్టింది రైతుల కోసం కాదు. రైతులను పాడే ఎక్కించడానికే అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతును రాజును చేసినం అని ప్రగల్భాలు పలికే చిన్న దొరా.. రైతు ఎట్లా రాజయ్యిండో సమాధానం చెప్పాలే అని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్పై ప్రశ్నల వర్షం కురిపించారు.
YS Sharmila On Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో ఖజానాను సీఎం కేసీఆర్ పీల్చుతున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి, తెలంగాణను అప్పుల కుప్ప చేశారంటూ ఫైర్ అయ్యారు.
YS Sharmila Unveiled YSR Statue: పాలేరు గడ్డ వైఎస్సార్ బిడ్డకు అడ్డా అని అన్నారు వైఎస్ షర్మిల. పాదయాత్రను మళ్లీ మొదలుపెడతానని.. 4 వేల కిలోమీటర్లను పాలేరులోనే పూర్తి చేస్తానని చెప్పారు. పాలేరులో వైఎస్సార్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు.
Ys Sharmila-Congress: తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ షర్మిల పేరు ఇప్పుడు హాట్ టాపిక్గా విన్పిస్తోంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రక్రియ వ్యవహారంలో మొదలైన చర్చ ఆమె తాజా ట్వీట్తో పీక్స్కు చేరుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Jagan-Ponguleti: ఓ వైపు తెలంగాణ ఎన్నికలు మరోవైపు ఏపీలో వేడెక్కుతున్న రాజకీయాలు. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న ఆ నేత హఠాత్తుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలవడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు మీ కోసం.
YSRTP chief YS Sharmila About Corruption in Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగింది అని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై తెలంగాణ మంత్రులు ఎదురుదాడికి దిగడాన్ని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పుపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో వచ్చిన కమీషన్లతో కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
YS Sharmila Slams KCR: అన్నివర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన మీది ప్రజల పక్షం కాదు... ప్రజలను దోచుకు తినే దొంగల పక్షం.. ఇంకా చెప్పాలంటే జనాలను పట్టి పీడించే బీఆర్ఎస్ పార్టీది దొంగల పక్షమే అవుతుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
YSRTP Merging In Congress: రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఇప్పటికే వైఎస్సార్టీపీ విలీనం దిశగా చర్చలు మొదలుపెట్టారని.. వైఎస్సార్టీపీ విలీనం ప్రతిపాదన ప్రస్తుతం చర్చల దశలో ఉందని రకరకాల ఊహాగానాలు తెరపైకొచ్చాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలనే ఈ విషయంపై స్వయంగా స్పందించారు.
YS Sharmila strong counter to KCR and KTR: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమర వీరులు చేసిన త్యాగాన్ని కల్వకుంట్ల వారి కుటుంబం తమ భోగంగా మల్చుకుంది అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఒక పార్టీ కాదని.. అది బందిపోట్ల రాష్ట్ర సమితికి "దోపిడీ మిషన్ " అని ఎద్దేవా చేశారు.
YS Sharmila Slams BJP, BRS: బీఆర్ఎస్ పార్టీ, బీజేపి మధ్య రహస్య స్నేహం ఉందన్న వైఎస్ షర్మిల.. ఈ రెండు పార్టీల తీరు లోకం ముందు నువ్వు కొట్టినట్లు చేస్తే.. నేను ఏడ్చినట్లు చేస్తా.. అన్న చందంగా ఉంది అని ఎద్దేవా చేశారు. అంతటితో ఊరుకోని వైఎస్ షర్మిల.. ఇంతకీ మీరు నడిపే రహస్య దోస్తానం ప్రీ పోల్ ఒప్పందమా ? లేక పోస్ట్ పోల్ ఒప్పందమా ? అని సూటిగానే ప్రశ్నించారు.
YS Sharmila On CM KCR: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చి స్పీచ్పై కామెంట్స్ చేశారు వైఎస్ షర్మిల. ఆయన ప్రసంగం అంతా అబద్దాలమయం అని అన్నారు. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పల పాలుజేశారని ఫైర్ అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.