భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు నమో యాప్ ద్వారా పార్టీ వర్కర్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను పంచుకున్నారు. సమాజాన్ని వివిధ గ్రూపులుగా విభజించడం అనేది కాంగ్రెస్ సంప్రదాయం అని.. కానీ బీజేపీకి ఆనందాన్ని పంచడమే వచ్చని ఆయన తెలిపారు.
గత పదేళ్ల కాలంలో 33 మంది ట్రక్ డ్రైవర్స్, వాళ్ల హెల్పర్స్ని దారుణంగా హతమార్చి, వారి వాహనాలను దొంగిలించిన సీరియల్ కిల్లర్ని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు వారాల క్రితమే ఈ సీరియల్ కిల్లర్ని భోపాల్కి సమీపంలో అరెస్ట్ చేసినట్టు సీనియర్ పోలీస్ అధికారి రాహుల్ కుమార్ లోధా తెలిపారు. ట్రక్కుల డ్రైవర్స్, వారి హెల్పర్స్ని హతమార్చడం, అనంతరం ఆ ట్రక్కులు తీసుకెళ్లి అందులోని లోడ్ ఒకచోట, వాహనాలను మరో చోట అమ్మేసుకోవడం అతడి నేరాల స్టైల్ అని పోలీసుల విచారణలో తేలింది.
జంతువులైనా ప్రాణులే కదా.. వాటికి మాత్రం కుటుంబం ఉండదా ? అవి మాత్రం సరదాలు కోరుకోవా అనే భావనతో ఏనుగుల కోసం వారం రోజలపాటు పిక్నిక్ ఏర్పాటు చేశారు మధ్యప్రదేశ్ లోని కన్హ నేషనల్ పార్క్ అధికారులు. ప్రతీ సంవత్సరం ఇలా ఇక్కడున్న ఏనుగుల కోసం వారం రోజులపాటు పిక్నిక్ ఏర్పాటు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఏనుగులకు సరదాగా పిక్నిక్ మాత్రమే కాదండోయ్... వాటికి బాడీ మసాజ్, హెడ్ మసాజ్ కూడా చేసి ఏనుగులను రంజింప చేస్తున్నారు. ఇదిగో ఆ వారం రోజుల పిక్నిక్ పండగలో భాగంగా చివరి రోజున ఏనుగులు ఎంజాయ్ చేస్తోన్న దృశ్యాలను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్విటర్లో పోస్ట్ చేసింది.
మధ్యప్రదేశ్లోని మాండ్సౌర్ ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల తల నరికి తన వద్దకు పట్టుకొస్తే రూ.5 లక్షలు బహుమతి ఇస్తానని బీజేపీ నేత సంజీవ్ మిశ్రా సంచలన ప్రకటన చేశారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.