Muthireddy Yadagiri Reddy vs Palla Rajeshwar Reddy: జనగాం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో చిచ్చు మొదలైందా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. జనగాం సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి vs పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నట్టుగా జరుగుతున్న వివాదంలో తాజాగా మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది.
ప్రస్తుతం జనగామ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్యే అయ్యేందుకు ముప్పతిప్పలు పడుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డిపై అనేక చోట్లా భూకబ్జాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. జనగాంలో ముత్తిరెడ్డిపై వ్యతిరేకత ఉందన్న ప్రచారానికి తోడు తాజాగా అభ్యర్థుల జాబితాలోనూ ముత్తిరెడ్డి పేరు లేకపోవడం జనగంలో బీఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ హీట్కి తావిచ్చింది.
Farmers Loans Waiver: రైతుల రుణ మాఫీకి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకి సోమవారం ఆదేశాలు జారీచేశారు. రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సోమవారం 9 లక్షల 2 వేల 843 మంది రైతులకు సంబంధించి 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేశారు.
Gaddar Idol on Tankbund: ట్యాంక్ బండ్పై గద్దర్ విగ్రహాన్ని స్థాపించాలి అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో ముద్రించాలన్న వైఎస్ షర్మిల.. గద్దర్ సొంత ఊరు తూప్రాన్ లో స్మారక భవనం నిర్మించి ఆయన స్పూర్తిని భవిష్యత్ తరాలకు పంచాలని అన్నారు.
KTR Review Meeting on Hyderabad Metro Rail Master Plan: హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ మాస్టర్ ప్లాన్పై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో రద్దీ, కాలుష్యం తగ్గేలా మెట్రో విస్తరిస్తున్నట్లు చెప్పారు. విశ్వ నగరంగా మారాలంటే ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం కావాలన్నారు.
Kavitha Absent for KTR's Nizamabad Meeting : ఇంతకాలం పాటు పెండింగ్లో పడుతూ పడుతూ వచ్చిన ఈ అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ ప్రారంభోత్సవాలకు మంచి ఊపు తీసుకొచ్చేలా కవిత చేసినప్పటికీ.. ఆమే ప్రారంభోత్సవాల్లో లేకపోవడం రాజకీయంగా చర్చకు తావిచ్చింది. ఇది బీఆరెస్లోనే కాదు ఇతర పార్టీల్లో కూడా చర్చకు వచ్చింది.
KTR Speech In Nizamabad Meeting : ఇదే సభా వేదికపై నుంచి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సైతం ఏకిపారేశారు. అతనొక థర్డ్ క్లాస్ క్రిమినల్ అంటూ రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తితో మనం తలపడాల్సి వస్తోంది అంటూ రేవంత్ రెడ్డిని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
BRS Working President KTR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్లీన్స్వీప్ దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. కేటీఆర్ నేతృత్వంలో వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మరో మూడు నెలలు గ్రౌండ్ లెవల్లోనే ఉండాలని నేతలకు సూచించారు కేటీఆర్.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రికి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యల వెనుక పెద్ద రాజకీయమే కన్పిస్తోంది. ఎన్నికల వేళ అందరి అభిమానాన్ని మూటగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Minister KTR Review Meeting: అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు కల్పించాల్సిన వసతులపై కీలక సూచనలు ఇచ్చారు. అన్ని శాఖాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
KTR's Plan for Revanth Reddy: ఇటీవల తెలంగాణలో ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి, ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి మధ్య తీవ్ర స్థాయిలో పెను మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. ఇరుపక్షాల నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది.
KTR Plans for Revanth Reddy: ఈ నెల 17వ తేదీ నుంచి పది రోజులపాటు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. ప్రతి రైతు వేదిక వద్ద కనీసం 1000 మంది రైతులకు తగ్గకుండా ఈ సమావేశాన్ని నిర్వహించాలని, ఈ సమావేశ నిర్వహణ బాధ్యతను స్వయంగా పార్టీ ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు.
Daifuku and Nicomac Taikisha in Ranga Reddy: జపాన్కి వెళ్లిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది నేర్చుకొని వస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లాలో రెండు భారీ కంపెనీలకు ఆయన శంకుస్థాపన చేశారు. 575 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ కంపెనీలు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కేసీఆర్ పుట్టింది రైతుల కోసం కాదు. రైతులను పాడే ఎక్కించడానికే అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతును రాజును చేసినం అని ప్రగల్భాలు పలికే చిన్న దొరా.. రైతు ఎట్లా రాజయ్యిండో సమాధానం చెప్పాలే అని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్పై ప్రశ్నల వర్షం కురిపించారు.
KTR Calls For Boycott of PM Modi Warangal Tour: ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్కు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
KTR Calls For Boycott of PM Modi Warangal Tour: ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్కు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
Revanth Reddy Pressmeet: చేరికలపై ఊహాగానాలు వద్దు.. చాలా అంశాలు చర్చల దశలోనే ఉన్నాయన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక.. మేమే అధికారికంగా ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావులతో పాటు ఇంకొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని వార్తలొస్తున్న తరుణంలోనే రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనియాంశమయ్యాయి.
Minister KTR Speech: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పురపాలనలో దేశంలోనే అద్భుతమైన ప్రగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అంటే అతిశయోక్తి లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్తో పాటు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ కార్యక్రమాలకు ఇచ్చిన అనేక అవార్డులు, ప్రశంసలే ఇందుకు నిదర్శనమన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.