AP Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి నెమ్మదిగా తగ్గుతోంది. ఓ నెల రోజుల్నించి ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో గణనీయంగా తగ్గుదల కన్పిస్తోంది. అటు పాజిటివ్ రేటు సైతం తగ్గుతోంది.
Krishna Water Dispute: కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం అంతకంతకూ పెరుగుతోంది. కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసుకున్న పిటీషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Ysr Pension Scheme: కరోనా సంక్షోభంలో సైతం ఏపీలో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. ఒకటవతేదీ వస్తే చాలు ఠంచనుగా పెన్షన్ ఇంటికి అందుతోంది. ఉదయం నుంచి ప్రారంభమైన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ రాష్ట్రంలో కొనసాగుతోంది.
AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.
Visakhapatnam IT Hub: ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ కంపెనీలు ముందుకొస్తున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా ఐటీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. అటు ప్రభుత్వం కూడా పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది.
Disha Bills: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రతకై ప్రవేశపెట్టిన దిశ బిల్లులు త్వరలో హోం మంత్విత్వశాఖ ఆమోదం పొందనున్నాయి. మరోవైపు రాష్ట్రంలో దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Ys Jagan Review: కరోనా నియంత్రణ చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి మరోసారి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాక్సినేషన్ను వేగవంతం చేస్తూనే..కరోనా థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు మౌళిక సదుపాయాలు మెరుగుపర్చుకునే దిశగా ఆదేశాలు జారీ చేశారు.
Vizag Steel Plant Issue: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం ఇప్పుడు ఏపీ హైకోర్డులో ఉంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్పై విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.
AP Government: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఇప్పుడు మరో విచారణ జరగనుంది. ప్రభుత్వంతో పాటు సీనియర్ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్రమశిక్షణ చర్యలకు దిగుతోంది. విచారణకు ఆదేశించింది.
Ap government: ఆంధ్రప్రదేశ్లో టీచర్ల సీనియారిటీ జాబితా సిద్ధమవుతోంది. న్యాయపరమైన వివాదాల్లేకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందరికీ అవకాశం కల్పించేందుకు మరింత గడువు కల్పించారు.
Eluru Corporation Counting: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో మిగిలిన ఒకే ఒక కార్పొరేషన్ ఫలితాలు మరి కాస్సేపట్లో వెల్లడి కానున్నాయి. హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏలూరు కార్పొరేషన్ కౌంటింగ్ ప్రారంభమైంది.
National Education Policy: ఏపీలో విద్యా సంస్కరణల్ని పెద్దఎత్తున అమలు చేస్తోంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా సంస్కరణలపై ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఛైర్మన్ ప్రశంసలు కురిపించారు.
AP Governor: కరోనా విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వం అత్యంత సమర్ధవంతంగా పనిచేసింది. మౌళిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన కల్పించింది. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ స్వయంగా చేసిన వ్యాఖ్యలివి.
AP IAS Transfers: ఆంధ్రప్రదేశ్ హఠాత్తుగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో 16 మంది ఐఏఎస్లకు స్థాన చలనం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.
Ysr Kapu Nestham: కరోనా సంక్షోభ సమయంలో సైతం ఏపీలో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల హామీల్లో భాగంగా కాపునేస్తం పథకం వరుసగా రెండో ఏడాది అమలవుతోంది. వైఎస్సార్ కాపునేస్తం రెండవ విడత నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది.
AP Night Curfew: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సంక్రమణను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అవసరమైన చర్యల్ని తీసుకుంటోంది. కరోనా థర్డ్వేవ్కు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
Ys jagan review on polavaram: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి సారించారు. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు పూర్తి కావడం, పనుల్లో క్వాలిటీ విషయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్..కొన్ని సూచనలు చేశారు.
APPSC JOBS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో భారీ ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఏపీపీఎస్సీ ద్వారా 12 వందల పోస్టుల భర్తీకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఆగస్టు నెలలో నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.