వైరల్‌గా మారిన విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మల ఫోటో

ఇంగ్లండ్ పర్యటనలో బాలీవుడ్‌లో పవర్ కపుల్‌గా పేరొందిన విరాట్ కోహ్లీ-అనుష్కా శర్మల జంట

Last Updated : Jul 20, 2018, 03:22 PM IST
వైరల్‌గా మారిన విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మల ఫోటో

ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉండటంతో బాలీవుడ్‌లో పవర్ కపుల్‌గా పేరొందిన విరాట్ కోహ్లీ-అనుష్కా శర్మల జంట కూడా అక్కడే పర్యటిస్తోంది. ఈ పర్యటనలో ఇప్పటికే శిఖర్ ధావన్‌ కుటుంబంతో అనుష్క, విరాట్ జంట తీసుకున్న ఫోటోలు వైరల్‌గా మారగా తాజాగా విరాట్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న మరో ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షేర్ చేసుకున్న తర్వాత 13 గంటల్లోనే ఈ ఫోటోకు దాదాపు 25 లక్షల లైక్స్ లభించాయంటే ఈ ఫోటోను విరుష్క అభిమానులు ఎంత ఇష్టపడుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా 18వేలకుపైగా ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ ఈ ఫోటోపై తమకు తోచినవిధంగా పాజిటివ్ కామెంట్స్ చేయడం ఈ జంటకు ఉన్న క్రేజ్‌ని స్పష్టంచేస్తోంది. 

 

 

👫

A post shared by Virat Kohli (@virat.kohli) on

ఇక అనుష్క కెరీర్ విషయానికొస్తే, ఆమె నటించిన జీరో సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉంది. ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో షారుఖ్, అనుష్క, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ముగ్గురూ కలిసి గతంలో యాశ్ చోప్రా తెరకెక్కించిన జబ్ తక్ హై జాన్ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. 

Trending News