బబిత ఫోగట్ మాటకు తూటా పేల్చిన గుత్తా జ్వాల...

దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరగడానికి తబ్లిగీ జమాత్ ప్రార్థనలే కారణమని భారత స్టార్ రెజ్లర్, బీజేపీ మహిళా నేత బబితా ఫోగాట్ ట్వీట్‌ చేసింది. అయితే దీనికి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల స్పందిస్తూ 

Last Updated : Apr 19, 2020, 01:04 AM IST
బబిత ఫోగట్ మాటకు తూటా పేల్చిన గుత్తా జ్వాల...

న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరగడానికి తబ్లిగీ జమాత్ ప్రార్థనలే కారణమని భారత స్టార్ రెజ్లర్, బీజేపీ మహిళా నేత బబితా ఫోగాట్ ట్వీట్‌ చేసింది. అయితే దీనికి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల స్పందిస్తూ స్పందిస్తూ ఒకవైపు బబితాను మందలిస్తూనే ఆ ట్వీట్‌ తొలగించమంటూ విజ్ఞప్తి చేశారు. ' సారీ బబితా.. ఈ కరోనా వైరస్‌ జాతి లేదా మతాన్ని చూస్తుందని అనుకోను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మనం స్పోర్ట్స్‌ పర్సనాలటీలం. మనం దేశానికే ప్రాతినిథ్యం వహిస్తున్నాం. మనం గెలిచినప్పుడు ప్రజలంతా కులాలు-మతాలు లేకుండా సెలబ్రేట్‌ చేసుకుంటారు. మన విజయాల్ని వారి గెలుపులుగా భావిస్తారు' అని జ్వాల పేర్కొన్నారు.

అంతేకాకుండా మరొక ట్వీట్‌లో పేర్కొంటూ.. తాను విమర్శలు ఎదుర్కొన్నప్పుడు భారతీయురాలిగానే ఉన్నానని, అదే సమయంలో తాను పతకాలు గెలిచినప్పుడు ఎవరూ ఏమతం అనేది చూడలేదన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా మనల్ని భారతీయులగా మాత్రమే గుర్తించారన్నారు. ప్రతీ ఒక్కరూ తన విజయాన్ని వారి విజయంగానే చూశారన్నారు. సమైక్యతే మన బలమని, దేశాన్ని విడగొట్టద్దు' అని జ్వాల పేర్కొన్నారు. వివాదాలు వద్దు. సమైక్యతే మన బలం. ఆ ట్వీట్‌ను తీసేయ్‌ అంటూ బబితా ఫోగాట్‌కు గుత్తా జ్వాల విజ్ఞప్తి చేస్తూ ట్వీట్‌ చేశారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News