Viral News: 27 ఏళ్లుగా ఒక్కరోజు కూడా లీవు తీసుకోని ఉద్యోగి.. విరాళాల రూపంలో ప్రేమ కురిపించిన నెటిజన్లు.. ఏకంగా రూ.2 కోట్లు విరాళం

Latest Viral News: 27 ఏళ్ల తన ఉద్యోగ జీవితంలో ఏనాడు సెలవు తీసుకోని ఆ ఉద్యోగికి ఆ సంస్థ ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి సరిపెట్టింది. కానీ నెటిజన్లు మాత్రం అతని గురించి తెలిసి విరాళాల రూపంలో తమ ప్రేమను కుమ్మరించారు.   

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 3, 2022, 03:54 PM IST
  • బర్గర్ కింగ్ ఉద్యోగి కెవిన్ ఫోర్డ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్
  • 27 ఏళ్లుగా ఒక్కరోజు కూడా లీవు తీసుకోని ఉద్యోగి
  • విరాళాల రూపంలో అతనిపై ప్రేమ కురిపించిన నెటిజన్లు
Viral News: 27 ఏళ్లుగా ఒక్కరోజు కూడా లీవు తీసుకోని ఉద్యోగి.. విరాళాల రూపంలో ప్రేమ కురిపించిన నెటిజన్లు.. ఏకంగా రూ.2 కోట్లు విరాళం

Latest Viral News: దాదాపు 3 దశాబ్దాలుగా ఒక సంస్థలో పనిచేస్తున్న వ్యక్తి ఇన్నేళ్ల కాలంలో ఒక్కరోజు కూడా లీవు తీసుకోలేదంటే నమ్మగలరా... కానీ నమ్మి తీరాల్సిందే. అమెరికాలోని లాస్ వేగాస్‌కి చెందిన 54 ఏళ్ల కెవిన్ ఫోర్డ్ తన 27 ఏళ్ల ఉద్యోగంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. ఇందుకు గాను అతను పనిచేస్తున్న బర్గర్ కింగ్ సంస్థ ఇటీవల అతనికి ఓ కానుక ఇచ్చింది. ఒక చిన్న బ్యాగ్‌లో సినిమా టికెట్, కొన్ని చాక్లెట్స్, మింట్స్, స్టార్ బక్స్ కప్‌ను ప్యాక్ చేసి ఇచ్చింది. నిజానికి అతని సేవలకు ఆ సంస్థ ఇచ్చిన గిఫ్ట్ చాలా చిన్నదే అయినా అతను సంతోషంగా స్వీకరించాడు. 

సంస్థ ఇచ్చిన గిఫ్ట్ పట్ల అతను సంతోషంగానే ఉన్నప్పటికీ.. నెటిజన్లకు మాత్రం ఈ విషయం తీవ్ర ఆగ్రహం తెప్పించింది. 27 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా లీవు తీసుకోకుండా కష్టపడి పనిచేస్తే.. అతనికిచ్చే గుర్తింపు, గౌరవం ఇదేనా అంటూ పలువురు నెటిజన్లు బర్గర్ కింగ్ సంస్థపై మండిపడ్డారు. ఇది ఒకరకంగా కెవిన్‌ని అవమానించడమేనని అంటున్నారు. ఇదే క్రమంలో కెవిన్ ఫోర్డ్ కూతురు తన తండ్రి కోసం ఏదైనా చేయాలనుకుంది. వెంటనే సోషల్ మీడియాలో గోఫండ్‌మీ అనే పేజీ ద్వారా తన తండ్రి కోసం విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది. అందులో తన తండ్రికి ఎదురైన అనుభవం గురించి వివరించింది. దీంతో నెటిజన్లు కెవిన్ ఫోర్డ్ పట్ల తమ ప్రేమను విరాళాల రూపంలో కురిపించారు.

నెటిజన్ల నుంచి భారీ స్పందన రావడంతో దాదాపు రూ.2.36 కోట్లు విరాళంగా వచ్చాయి. మొదట హాలీవుడ్ నటుడు డేవిడ్ స్పేడ్ తనవంతుగా రూ.3.9 లక్షలు విరాళంగా ఇచ్చాడు. డేవిడ్ బాటలో మరికొందరు భారీగా విరాళాలు ఇవ్వడంతో రూ.2 కోట్ల పైచిలుకు వసూలైంది. ఈ మొత్తాన్ని తన తండ్రికి ఇవ్వనున్నట్లు కెవిన్ ఫోర్డ్ కూతురు తెలిపింది. తనకు ఆ డబ్బు వచ్చినా సరే.. తాను మాత్రం యథావిధిగా తన పని తాను చేసుకుంటానని కెవిన్ ఫోర్డ్ చెప్పడం అతని వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పకనే చెబుతోంది. కెవిన్ వ్యక్తిత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

 

Also Read: Actor Naresh -Pavitra Lokesh: రెడ్ హ్యాండెడ్ గా ఒకే గదిలో దొరికిన నరేష్-పవిత్ర.. చెప్పుతో కొట్టబోయిన రమ్య రఘుపతి!

Also Read: Macherla Niyojakavargam: కాక రేపుతున్న అంజలి.. 'మాచర్ల నియోజకవర్గం'లో రచ్చ చేయడానికి సిద్ధం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News