ప్రధాని మోడీ.. రోజు భోజన ఖర్చు రూ.4 లక్షలు !

Last Updated : Dec 13, 2017, 01:13 PM IST
ప్రధాని మోడీ.. రోజు భోజన ఖర్చు రూ.4 లక్షలు !

గుజరాత్ రెండో దశ ఎన్నికల గడువు ముగిసింది. చిరవి రోజు ప్రచారంలో భాగంగా ఈ రోజు కాంగ్రెస్,బీజేపీ నేతలు ఒకరినొకరు వాడీ వేడీ విమర్శలు సంధించుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కు చెందిన ఓబీసీ యువనేత  నేత ఠాగుల్ అల్పేశ్‌ ఠాకూర్‌  ప్రధాని మోడీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ఒక ఒకప్పుడు నల్లగా ఉండే మోదీ ఇప్పుడు టమోటాలా తయారయ్యారు..దాని రహస్యమేంటో తెలుసా అంటూ..ఆయన ప్రతి రోజు తైవాన్‌ నుంచి తెప్పించే పుట్టగొడుగులు తింటార‌ని ...అవి ఒక్కోటి 80 వేల రూపాయ‌లు..ఇలాంటివి మోదీ రోజుకు ఐదు తింటారని చెప్పారు. మొత్తంగా చూస్తే రోజుకి మోదీ భోజ‌న ఖ‌ర్చు 4 లక్షల రూపాయ‌లని ..ఇలా  నెలకు ఆహారం కోసం రూ కోటీ 20 లక్షలు వెచ్చించే మన ప్రధానికి పేదల కష్టాలు ఎలా తెలుస్తాయని ఎద్దేవ చేశారు.

దేశంలో ఆకలితో అలమటించే పేదలు ఎంతో మంది ఉన్నారు..వారి కడుపునిందేందుకు చర్యలు తీసుకొని ఆదర్శంగా నిలవాల్సి ప్రధాని.. తన కడుపు నింపుకునేందుకే నెలకు కోటి రూపాయలకుపైగా  వెచ్చిస్తున్నారని విమర్శలు సంధించారు. ఇలా తిండి కోసం ఇంత మొత్తంలో ఖర్చు చేసే ఏకైక ప్రధాని అంటూ మోడీపై  అల్పేశ్‌ ఠాకూర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 <

>

Trending News