India: కొనసాగుతున్న కరోనా విలయతాండవం.. 46లక్షలు దాటిన కేసులు

భారత్‌లో కరోనావైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ మూడు నాలుగురోజుల నుంచి లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిత్యం రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. మరణాలు నమోదవుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది.

Last Updated : Sep 12, 2020, 10:22 AM IST
India: కొనసాగుతున్న కరోనా విలయతాండవం.. 46లక్షలు దాటిన కేసులు

Covid-19 updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ మూడు నాలుగురోజుల నుంచి లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిత్యం రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. మరణాలు నమోదవుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో శుక్రవారం ( సెప్టెంబరు 11న ) దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్తగా.. 97,570 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు నిన్న ఒక్కరోజే ఈ మహమ్మారి కారణంగా 1,201 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 46,59,985 కి పెరగగా.. మరణాల సంఖ్య 77,472 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Drugs case: డ్రగ్స్ కేసులో.. హీరోయిన్లు సారా, రకుల్?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,58,316 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 36,24,197 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. శుక్రవారం దేశవ్యాప్తంగా 10,91,251 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో సెప్టెంబరు 11 వరకు మొత్తం 5,51,89,226 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 77.77 శాతం ఉండగా.. మరణాల రేటు 1.66శాతం ఉంది.    Also read: Ketika Sharma: కేతిక అందాలు అదరహో..

 

Trending News