దావూద్ నెక్స్ట్ టార్గెట్ "ధనిక మహిళలే"

గతంలో బడా బడా పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేసి.. అందులో కొందరిని హత్యచేసి.. కోట్లు గడించిన దావూద్ ముఠా ఇప్పుడు కొత్త పథకాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. 

Last Updated : Dec 8, 2017, 03:19 PM IST
దావూద్ నెక్స్ట్ టార్గెట్ "ధనిక మహిళలే"

ఇప్పటి వరకు కొనసాగుతున్న మాఫియా సంప్రదాయాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం తెరదించుతున్నట్లు తెలుస్తోంది. గతంలో బడా బడా పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేసి.. అందులో కొందరిని హత్యచేసి.. కోట్లు గడించిన దావూద్ ముఠా ఇప్పుడు కొత్త పథకాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనాటి వరకు వీరి దృష్టి మహిళా పారిశ్రామికవేత్తలపై పడలేదట. కేవలం పురుషులను మాత్రమే టార్గెట్ చేసేవారట.

ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా, యజమానులుగా ఉన్న మహిళలను కూడా టార్గెట్ చేసి.. డబ్బు డిమాండ్ చేయాలని దావూద్ ముఠా యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ముంబయిలోని ఖార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ ఫిర్యాదు ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తుందని మాజీ ఐపీఎస్ ఆఫీసర్ పీకే జైన్ జీన్యూస్‌కు తెలిపారు.

ఓ ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్తను కోటి రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తూ.. గత కొంతకాలంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయట. పోలీసులకు ఫిర్యాదు చేయగా,ఫోన్ నెంబర్లను ట్రేస్ చేసిన అధికారులు అవి పాకిస్తాన్ నెంబర్లని తేల్చారు. ఇప్పుడు మహిళలను టార్గెట్ చేసే నేరపూరితమైన ఆపరేషన్స్ చేయడానికి దావూద్, ఉస్మాన్ అనే వ్యక్తిగా పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగించాడని కూడా సమాచారం. 

Trending News