రాజస్థాన్​లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.6 తీవ్రత

రాజస్థాన్​ జాలౌర్​లో భూకంపం సంభవించింది. శనివారం అర్ధరాత్రి 2.26 గంటల సమయంలో.. భూమి కంపించింది.  రిక్టర్​ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2021, 01:59 PM IST
రాజస్థాన్​లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.6 తీవ్రత

Earthquake in Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో భూప్రకంపనలు సంభవించాయి. భూకంపం ధాటికి ​ జాలౌర్ (Earthquake in Rajasthan)​ ప్రజలు ఉలిక్కిపడ్డారు. శనివారం అర్ధరాత్రి 2.26 గంటల సమయంలో.. భూమి కంపించింది. దీంతో ఇళ్లల్లో నిద్రపోతున్న ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(National Center for Seismology) వెల్లడించింది. జోధ్​పుర్​కు 150 కిలోమీటర్లు దూరంలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రం (Earthquake ) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. 

Also Read: తిరుమల నడక మార్గంలో అడుగడుగునా విరిగిపడిన భారీ వృక్షాలు, కొండ చరియలు..

ఇటీవల కాలంలో ఇండియాలో తరుచుగా భూకంపాలు(Earthquak) సంభవిస్తున్నాయి. ముఖ్యంగా హిమాలయ పర్వత రీజియన్ తోపాటు అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో భూకంపాలు వస్తున్నాయి. దీంతో పాటు మణిపూర్, అస్సాం రాష్ట్రాల్లో ఇటీవల భూకంపాలు సంభవించాయి. రీసెంట్ గా వైజాగ్ లో కూడా భూమి కంపించింది. అయితే ఇవన్నీ తక్కువ తీవ్రత కలిగినవే కావడంతో పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టాలు కలగలేదు. కేవలం రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5 లోపే ఉంటుండటంతో పెద్దగా నష్టం కలగలేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News