Diabetes Control Tips: మధుమేహం ఉన్నవారు ఇలా ఇవి తీసుకోండి చాలు.. భవిష్యత్‌లో ఈ సమస్యలు రావు ఇది నిజం..

Turmeric For Diabetes: మధుమేహం వ్యాధిగ్రస్తులు ఆహారంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేక పోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవడం, ఆధునిక జీవనశైలి కారణంగా కూడా మధుమేహం వచ్చే అవకాశాలున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2022, 12:00 PM IST
  • పసుపు, ఉసిరికాయ పొడిని నీటిలో
  • కలుపుకుని తాగితే కేవలం 10 రోజుల్లో ..
  • మధుమేహం నియంత్రణలో ఉంటుంది
Diabetes Control Tips: మధుమేహం ఉన్నవారు ఇలా ఇవి తీసుకోండి చాలు.. భవిష్యత్‌లో ఈ సమస్యలు రావు ఇది నిజం..

Turmeric For Diabetes: మధుమేహం వ్యాధిగ్రస్తులు ఆహారంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేక పోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవడం, ఆధునిక జీవనశైలి కారణంగా కూడా మధుమేహం వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇప్పటికే మధుమేహంతో బాధపడేవారు తీసుకునే ఆహారంలో చక్కెర పరిమాణాలు తక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే చాలా మేలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే ఈ సమస్య ప్రాణాంతకంగా మారే అవకాశాలు అధికమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ మధుమేహం నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల ఔషధ గుణాలున్న దినుసులను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మధుమేహం నుంచి ఉపశమనం పొందడానికి ఔషధ గుణాలు కలిగిన పసుపు ప్రధాన పాత్ర పోషిస్తుంది. పసుపును ఎలా తీసుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

డయాబెటిస్‌ ఉన్నవారికి పసుపు ఎలా ఉపశమనాన్ని ఇస్తుంది:
డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా ఈ పసుపును తీసుకుంటే.. మధుమేహానికి చెక్‌ పెట్టొచ్చు. అయితే ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు సహాయపడుతుంది. అయితే ఈ పసుపును అనేక రకాలుగా వినియోగించవచ్చు.

1. పసుపు, ఉసిరికాయ (Turmeric With Amla):
పసుపు, ఉసిరి రెండు మధుమేహంతో బాధపడుతున్నవారికి ప్రభావవంతంగా పని చేస్తుంది. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌లను సులభంగా తగ్గిస్తుంది.  ఉసిరిలో ఉండే క్రోమియం కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ సమస్యలకు చెక్‌ పెడుతుంది. అయితే దీని కోసం ఉసిరి పొడిని, పసుపు పొడిని నీటిలో కలుపుకుని తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి.

2. మిరియాలు, పసుపు: (Turmeric With Black Pepper):
పసుపు, నల్ల మిరియాలు మధుమేహంతో బాధపడుతున్నవారికి ప్రభావవంతంగా ఉపయోగపడుతాయి. ఇందులో ఉండే గుణాలు చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.  ఈ రెండిటిని పొడి చేసుకుని క్రమం తప్పకుండా నీటిలో కలుపుకుని తాగితే అన్ని శరీరానికి ప్రయోజనాలు కలగడమేకాకుండా మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతుంది.

3. పసుపు, దాల్చిన చెక్క (Turmeric With Cinnamon):
పసుపు, దాల్చిన చెక్క పొడి కామినేషన్‌ కూడా మధుమేహంతో బాధపడుతున్నవారికి మంచి ప్రయోజనాలను చేకూర్చుతుంది. అయితే ఈ రెండు పొడులను తీసుకుని నీటిలో కలుపుకుని  అల్పాహారం సమయంలో తాగితే శరీరం దృఢంగా అవ్వడమేకాకుండా.. మధుమేహం నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ డ్రింక్‌ను క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News