Vijayasai Reddy on Chiranjeevi: చిరంజీవి గాడ్ ఫాదర్ పై విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్..ఇప్పుడెందుకు చెప్మా?

Vijayasai Reddy Tweet on Megastar Chiranjeevi's God Father Became Hot Topic: గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో ఈ నెల 28వ తేదీన జరగబోతోంది. ఈ విషయం మీద వైసీపీ నెంబర్ 2గా చెప్పుకునే విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 26, 2022, 02:44 PM IST
Vijayasai Reddy on Chiranjeevi: చిరంజీవి గాడ్ ఫాదర్ పై విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్..ఇప్పుడెందుకు చెప్మా?

Vijayasai Reddy Tweet on Megastar Chiranjeevi's God Father Became Hot Topic: మెగాస్టార్ చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డైరెక్టర్ గా తమిళ డైరెక్టర్ మోహన్ రాజా వ్యవహరిస్తున్నారు. ఆయన తెలుగువాడే అయినా డైరెక్ట్ గా తమిళ్ లో సెటిల్ అయ్యారు. గతంలో తెలుగులో హనుమాన్ జంక్షన్ లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన మోహన్ రాజా తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ వరుస సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ దక్కించుకున్నారు.

చాలా రోజుల తర్వాత చిరంజీవి లూసిఫర్ సినిమా రీమేక్ అవకాశం ఆయనకు రావడంతో దాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రూపొందించారు. ఈ సినిమాలో మలయాళంలో మోహన్ లాల్ నటించిన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో సల్మాన్ ఖాన్, మంజు వారియర్ నటించిన పాత్రలో నయనతార, వివేక్ ఒబెరాయ్ నటించిన పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నారు. ఒక కీలకమైన జర్నలిస్టు పాత్రలో పూరి జగన్నాథ్ అలాగే చిరంజీవి అనుచరుడి పాత్రలో సునీల్ కూడా కనిపించబోతున్నారు.

స్వయంగా కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద ఈ సినిమాను ఆర్.బి చౌదరి, ఎన్వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో ఈ నెల 28వ తేదీన జరగబోతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది అయితే ఇప్పుడు ఈ విషయం మీద వైసీపీ నెంబర్ 2గా చెప్పుకునే విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

‘’మెగాస్టార్ చిరంజీవి గారి సందేశాత్మక చిత్రం గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో చేస్తుండడం సంతోషకరం, ఆయనకు నా శుభాకాంక్షలు, నాలుగున్నర దశాబ్దాలుగా చిత్ర సీమను రంజింప చేస్తున్న మెగాస్టార్ లో అదే ఉత్సాహం, ఆయన జీవితం ఎందరి కోసం స్ఫూర్తి దాయకం అంటూ విజయ్ సాయి రెడ్డి ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. నిజానికి మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ మీద వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతూ ఉంటారు.

పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే చిరంజీవితో మాత్రం వారంతా ఎందుకో సఖ్యత మైంటైన్ చేస్తూ వస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవిని ఇంటికి భోజనానికి పిలిపించుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో రాజ్యసభ సీట్ ఆఫర్ చేశారని కానీ చిరు తిరస్కరించారు అనే వాదన కూడా ఉంది.

కానీ దానిమీద అధికారిక ప్రకటన ఏదీ లేదు. అయితే ఇప్పుడు ఆసక్తికరంగా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో చేస్తున్న విషయాన్ని ప్రశంసిస్తూ విజయ సాయి రెడ్డి ట్వీట్ చేయడం మరోమారు  చర్చనీయాంశంగా మారింది, ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన రాజకీయాలు డైలాగ్ ఒకటి మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా వదిలారు. అది ఒక్కసారిగా కలకలం సృష్టించింది.

రాజకీయం నాకు దూరం కాలేదు నేనే రాజకీయానికి దూరమయ్యాను అంటూ మెగాస్టార్ వదిలిన డైలాగ్ కలకలం సృష్టించింది. తాజాగా ఈ విషయం మీద కూడా మెగాస్టార్ ప్రమోషన్స్ లో స్పందించారు. ఇలా జరగటం కూడా మంచిదే అని పేర్కొన్నారు. ఆయన అలా పేర్కొన్న ఒక్కరోజు వ్యవధిలోనే ఇలా వైసీపీ నెంబర్ 2గా చెప్పుకునే విజయసాయిరెడ్డి మెగాస్టార్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: Cricketers Meeting Ram Charan: అప్పుడు కాకా అన్నారు.. ఇప్పుడేమంటారు యాంటీస్.. కొత్త వాదన తెర మీదకు!

Also Read: Aadi Movie Re Release: నవంబర్లో 'ఆది' రీ రిలీజ్.. ఎన్టీఆర్ ఫాన్స్ కు విషమ పరీక్షే.. ఎందుకంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News