దాదాసాహెబ్ ఫాల్కె అవార్డుల ప్రదానం.. ఉపాసనకు దక్కిన అరుదైన గౌరవం!

దాదాసాహెబ్ ఫాల్కె అవార్డుల ప్రదానం.. ఉపాసనకు దక్కిన అరుదైన గౌరవం! 

Last Updated : Apr 22, 2019, 12:14 AM IST
దాదాసాహెబ్ ఫాల్కె అవార్డుల ప్రదానం.. ఉపాసనకు దక్కిన అరుదైన గౌరవం!

ముంబై: దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు శనివారం రాత్రి ముంబయిలో అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్‌ నటీమణులు కాజోల్‌, అథితి రావు హైదరి, అపర్శక్తి, ఖురాన్నా, ప్రనుతాన్‌, అమృతరావు, శ్రియ, కియారా అద్వాని, కొరియోగ్రాఫర్‌ కరోజ్‌ ఖాన్‌, గాయకుడు ఉదిత్‌ నారాయణ వంటి సినీప్రముఖులు ఈ వేడుకకు హాజరై ఆహుతులను ఆకట్టుకున్నారు. గతేడాది ధడక్‌ సినిమాతో అరంగేట్రం చేసిన శ్రీదేవి తనయ జాన్వి కపూర్‌, ఇషాన్‌ కట్టర్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరూ దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డును అందుకున్నారు. డిజిటల్‌ సన్సెషన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును సాఖిబ్‌ సలీమ్‌, కుబ్రా సైట్‌ గెలుచుకున్నారు. టీవీ నటి సుమోనా చక్రవర్తి, గాయకుడు గురు రంధవలకు దాదా సాహెబ్‌ పురస్కారాలు వరించాయి.

రామ్‌ చరణ్‌ భార్య ఉపాసనకు ఫిలాన్‌త్రోపిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఫాల్కే అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా ఉపాసన అవార్డు పట్టుకున్న ఫొటోను చెర్రీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ.. 'డియరెస్ట్‌ ఉప్సీ.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఫిలాన్‌త్రోపిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు కంగ్రాట్స్‌' అని పేర్కొన్నారు.
 

Trending News