స్టార్ హీరో కొడుకుపై అత్యాచార ఆరోపణలు

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ పై అత్యాచార ఆరోపణలతో కేసు నమోదు చేశారు. 

Last Updated : Jul 2, 2018, 11:45 PM IST
స్టార్ హీరో కొడుకుపై అత్యాచార ఆరోపణలు

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ పై అత్యాచార ఆరోపణలతో కేసు నమోదు చేశారు. అలాగే మిథున్ చక్రవర్తి సతీమణి యోగితా బాలిపై కూడా మోసపూరితంగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు చేయమని రోహిణి కోర్టు బెగంపూర్ పోలీసులను ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే, ఓ యువతి మహాక్షయ్ పై ఫిర్యాదు చేస్తూ.. 2015 సంవత్సరం నుండి ఆయనతో తనకు శారీరక సంబంధాలు ఉన్నాయని తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మిథున్ కుమారుడు మోసం చేశాడని.. ఈ విషయం అతని తల్లికి తెలుసని చెబుతూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తాను కూడా పలు హిందీ, భోజ్‌పూరి చిత్రాల్లో నటించినట్లు ఆ యువతి తెలిపింది. ప్రస్తుతం మిథున్ చక్రవర్తి కుటుంబీకులు తనను మానసికంగా వేధిస్తున్నారని సదరు యువతి పేర్కొంది. 

మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ 2008లో "జిమ్మి" చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఆయన పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. "మిమో" అనే నిక్ నేమ్‌తో ఆయన సుపరిచితుడు. హాంటెడ్, లూట్, ఎనిమీ మొదలైన సినిమాల్లో కూడా మహాక్షయ్ నటించారు. 2015లో రిలీజైన "ఇష్క్ దరియా" మహాక్షయ్ నటించిన ఆఖరి చిత్రం.

Trending News