ప్రముఖ హీరో కుమారుడిపై అత్యాచార ఆరోపణలు

2015 నుంచి మహాక్షయ్‌తో తనకు సంబంధం ఉందని ఓ యువతి ఢిల్లీలోని రోహిణి కోర్టును ఆశ్రయించింది.

Last Updated : Jul 3, 2018, 11:26 AM IST
ప్రముఖ హీరో కుమారుడిపై అత్యాచార ఆరోపణలు

బాలీవుడ్ నటుడు, మాజీ ఎంపీ మిథున్ చక్రవర్తి భార్య యోగితా బాలి, కుమారుడు మహాక్షయ్ చక్రవర్తిలపై మోసం, అత్యాచారం, బెదిరింపు కేసులు నమోదయ్యాయి. మహాక్షయ్ తనపై అత్యాచారం చేసాడని, 2015 నుంచి అతనితో తనకు సంబంధం ఉందని ఓ యువతి ఢిల్లీలోని రోహిణి కోర్టును ఆశ్రయించింది. ఇద్దరం ఫోన్, చాటింగ్‌ల ద్వారా నిత్యం మాట్లాడుకునే వాళ్లమని.. ఈ క్రమంలో ఒక రోజు తన ఫ్లాట్‌కు రమ్మని పిలిచాడని, వెళ్లిన తనకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది.

అప్పటి నుంచి పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడని కోర్టుకు తెలిపింది. అతడి వల్ల తాను గర్భం దాల్చగా కొన్ని మందులు ఇచ్చాడని.. వాటివల్ల గర్భస్రావం అయిందని ఆరోపించింది. యోగితా కూడా తనను ఫోన్‌లో బెదిరించిందని ఆ యువతి పేర్కొనగా.. వారిద్దరిపై కేసు నమోదు చేయాల్సిందిగా రోహిణీ కోర్టు ఆదేశాల జారీ చేసింది. కాగా త్వరలోనే మహాక్షయ్ పెళ్లికి సిద్దమవుతున్న నేపథ్యంలో తాజా ఆరోపణలు సంచలనంగా మారాయి.

Trending News