బీజేపీ చీఫ్ కు మంచు లక్ష్మి ఫన్నీ కౌంటర్

బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ షాక్ కు మంచులక్ష్మి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు.

Last Updated : Dec 19, 2017, 04:30 PM IST
బీజేపీ చీఫ్ కు మంచు లక్ష్మి ఫన్నీ కౌంటర్

గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ చీఫ్ అమిత్ షా మాట్లాడుతూ గుజరాత్ లో తాము మొత్తం 150 సీట్లను సాధిస్తామనుకున్నామని...అయితే 28 శాతం జీఎస్టీని తీసేసి ప్రజలు 99 సీట్లు ఇచ్చారని చమత్కరించారు. మంచులక్ష్మి  ఈ అంశాన్ని  ప్రస్తావిస్తూ 182లో 28 శాతం అంటే 51 అవుతుంది. బీజేపీ అడిగిన 150 సీట్లలో 51 సీట్లను తీసేస్తే మిగిలేది 99. అవే బీజేపీకి వచ్చాయని ఫన్నీ కౌంటర్ ఇచ్చారు. ఆమె మటలను యథాతథంగా చదవండి... 'ఫౌండ్ దిస్ ఫన్నీ' 182 సీట్లున్న గుజరాత్ లో అమిత్ షా 150 సీట్లను అడిగారు...గుజరాత్ ప్రజలు ఆ మొత్తం సీట్ల నుంచి 28 శాతం జీఎస్టీని తీసేసి 99 సీట్లు ఇచ్చారు.  మీ 28 శాతం జీఎస్టీని మీరే మరచిపోతే ఎలా? అంటూ బీజేపీ చీఫ్ కు ట్విట్టర్ ద్వారా కౌంటరిచ్చారు మంచు లక్ష్మి.  ఆమె చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

 

Trending News