మరోసారి కలిసిన మహేష్, తారక్, చరణ్

టాలీవుడ్‌లో నేటి తరం టాప్ హీరోలు మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిస్తే ఆ సందడే వేరు.

Last Updated : Jul 28, 2018, 01:03 PM IST
మరోసారి కలిసిన మహేష్, తారక్, చరణ్

టాలీవుడ్‌లో నేటి తరం టాప్ హీరోలు మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిస్తే ఆ సందడే వేరు. ఫ్యామిలీస్‌తో కలిసి మరీ పార్టీలకి హాజరవుతూ ఫొటోలకీ ఫోజులిస్తున్నారు. ఆ మధ్య భరత్‌ అనే నేను బహిరంగ సభ ఈవెంట్‌ సందర్భంగా జరిగిన పార్టీలో సందడి చేసిన ఈ ముగ్గురు హీరోలు.. తాజాగా వంశీ పైడిపల్లి పుట్టిన రోజు వేడుకల్లో కలిశారు.

శుక్రవారం దర్శకుడు వంశీ పైడిపల్లి.. తన పుట్టినరోజుని పురస్కరించుకుని హైదరాబాద్‌లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి ఈ ముగ్గురు హీరోలతో కలిసి దిగిన ఫోటోను తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడా ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఈ ఫోటో చూసిన అభిమానులు ముగ్గురు హీరోలతో కలిసి వంశీ పైడిపల్లి మల్టీ స్టారర్ మూవీని ప్లాన్ చేస్తున్నాడా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం వంశీ-మహేష్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే! వంశీ గతంలో ఎన్టీఆర్‌తో ‘బృందావనం’, రామ్ చరణ్‌తో ‘ఎవడు’ చిత్రం చేశారు.

Trending News