Razakar Trailer Talk: ఓంకారం వినిపించకూడదు.. కాషాయం కనిపించకూడదు.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న 'రజాకార్' ట్రైలర్..

Razakar Telugu Trailer Review: గత కొన్నేళ్లుగా తెలుగు సహా వివిధ భాషల్లో చరిత్రలో జరిగిన నిజ జీవిత ఘటనల నేపథ్యంలో పలు చిత్రాలు వస్తున్నాయి. తాజాగా ఈ కోవలో 1947 నుంచి 1948 వరకు హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీ ప్రజలపై నిజాం ప్రైవేటు సైన్యం చేసిన అరాచకాల నేపథ్యంలో 'రజాకార్' మూవీ తెరకెక్కింది. ఇప్పటికే హిందీ ట్రైలర్ విడుదల చేయగా.. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేసారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 12, 2024, 03:03 PM IST
Razakar Trailer Talk: ఓంకారం వినిపించకూడదు.. కాషాయం కనిపించకూడదు.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న 'రజాకార్' ట్రైలర్..

Razakar Telugu Trailer Review: తెలుగు సహా వివిధ భాషల్లో నిజ జీవిత గాథలతో పాటు చరిత్రలో జరిగిన నిజ జీవిత సంఘటల ఆధారంగా పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ కోవలో తాజాగా తెరకెక్కిన  చిత్రం 'రజాకార్'. 1947లో బ్రిటిష్ వాళ్లు వెళుతు వెళతూ.. దేశాన్ని భారత్, పాకిస్థాన్ అంటూ రెండు దేశాలుగా విభజించి మనకు స్వాతంత్య్రం ఇచ్చారు. అప్పటికే దేశంలో 500పైగా స్వతంత్ర్య సంస్థనాలు వాళ్ల ఇష్ట ప్రకారం భారత్‌లో కానీ.. పాకిస్థాన్‌లో కానీ.. లేదా విడిగా ఉండొచ్చని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటన చేసి మరి వెళ్లింది. ఇక దేశానికి తొలి హోంమంత్రిగా పనిచేసిన సర్ధార్ వల్లభబాయ్ పటేల్ అత్యంత చాకచక్యంతో దేశంలోని 500 పైగా సంస్థానాధీశులతో మాట్లాడి మన దేశంలో విలీనమయ్యేలా చేసారు. కానీ దేశంలో కశ్మీర్, జునాఘడ్, హైదరాబాద్ సంస్థానలు మన దేశంలో విలీనం కాకుండా మొండి కేసాయి. కానీ స్వాతంత్య్రం వచ్చిన కొన్ని రోజులకే కశ్మీర్ పై పాకిస్థాన్ వాళ్లు అటాక్ చేసారు. అపుడు కశ్మీర్ రాజు మన దేశంలో కలుస్తానని ప్రకటన చేసారు. ఆ తర్వాత జునాఘడ్ కూడా భారత్‌లో విలీనమైంది.

కానీ హైదారబాద్‌ను పరిపాలిస్తోన్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం హైదరాబాద్‌ను పాకిస్థాన్‌లో విలీనం చేస్తానని ప్రకటన చేసారు. అప్పటి ఆగడాలపై రజాకార్ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదల చేసారు. ఇందులోని డైలాగులు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

ఇక్కడ మెజారిటీ ప్రజలు హిందువులే ఉన్నారు. వారు హిందూస్థానే కోరుకుంటున్నారు. వాళ్లు ఇక్కడ మతమన్నా మారాలి. లేక రాజ్యామన్న ఒదలాలే. మతం మారితే దోస్తి.. మారకపోతే దుష్మన్. హిందువులుగా పుట్టి బానిసలయిన్రు. ఇస్లామ్‌లోకి మారి మాలిక్‌లు అవ్వండి అంటూ రజాకార్ సైన్యం చెప్పే డైలాగులు అప్పటి పరిస్థితులకు అద్దం పట్టింది. ఓంకారం వినిపించకూడదు.. కాషాయం కనిపించకూడదు. ఇది మాట కాదు.. నిజాం శాసనం..

హైదరాబాద్‌ను హిందూస్థాన్‌లో విలీనం చేయకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయట. సర్ధార్ పటేల్ నుంచి లేఖ వచ్చిందని నిజాం నవాబు మంత్రి ఆయనకు చెప్పడం. హైదరాబాద్ అఖండ భారతానికి హృదయం లాంటిది అంటూ సర్ధార్ పటేల్ చెప్పే డైలాగులు ఆలోచింపజేస్తాయి.

ఇక యుద్దం చేయాల్సిందే. ఆ మతోన్మాదులను సమాధి చేయాల్సిందే. చంపడమే తెలిసినోళ్లకు చావు భయమేంటో చూపించాలని నిజాంపై తిరగబడ్డ ఇక్కడ భూమి పుత్రలు వారిని ఎలా ఎదుర్కొన్నారనేది ఈ సినిమాలో చూపించారు.  హైదరాబాద్‌ను తుర్కిస్థాన్‌గా మార్చడానికి జిన్నా మాటిచ్చిండు. హిందూస్థాన్‌ను కాలుతున్న కాఫిర్ల శవాల వాసనలతో నింపేయండి అంటూ ఖాసీం రజ్వీ చెప్పే డైలాగులు.. మరోవైపు సర్ధార్ పటేల్.. నేను హైదరాబాద్‌ను మరో కశ్మీర్‌లా మారనివ్వను. ఇక నిజాంపై సర్ధార్ పటేల్ ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ యాక్షన్‌కు దిగడం. చర్చలు లేవు, సంధి లేదు. యుద్ధం జరగాల్సిందే అంటూ సర్ధార్ పటేల్ చెప్పే డైలాగులు  గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీ ప్రజలుగా ఉన్న హిందువులపై నిజాం... ఖాసీం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ పేరుతో ఓ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసారు. వారు ఏ విధంగా ఇక్కడ ప్రజలను హింసించారు. ఇక్కడ ప్రజలు నిజాం ప్రైవేటు సైన్యంపై ఏ రకంగా తిరుగుబాటు చేసారు. అక్కడ జరగుతున్న ఆగడాలను తెలుసుకున్న అప్పటి కేంద్రం హోం మంత్రి సర్ధార్ పటేల్ జే.ఎన్. చౌదరి నేతృత్వంలో హైదరాబాద్ విముక్తి కోసం 'ఆపరేషన్ పోలో' నిర్వహించారు. నిజాం సైన్యం వారిని ఎదుర్కొంటామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. కానీ తీరా సైన్యం హైదరాబాద్ పరిసరాల్లో ప్రవేశించే సరికి తోక ముడిచి లొంగిపోయారు. అటు నిజాం కూడా 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు రేడియోలో ప్రకటించారు. ఇలా హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందింది. ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రజలు ఎలా పోరాటం చేసారు. రజకార్ల ఆగడాలను ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో మార్చి 1న ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే.. నిజాం పాత్రలో నటించారు. బాబీ సింహా..రజాకార్లను ఎదురించే యోధుడి పాత్రలో యాక్ట్ చేసాడు. తెలుగు హీరోలు ఎవరు ఇటువంటి సబ్టెక్ట్ చేసే ధైర్యం లేకపోవడంతో బాబీ సింహాతో ఈ పాత్రను చేయించినట్టు ఉంది.

ఈ చిత్రంలో బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, అనసూయ, ఇంద్రజ, మకరంద్ దేశ్‌పాండే నటించారు. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. అప్పట్లో హైదరాబాద్ అంటే తెలంగాణలో 8 జిల్లాలు ఉండేవి. మహారాష్ట్రలో 5 జిల్లాలు.. కర్ణాటకలోని మూడు జిల్లాలు హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేవి. మొత్తంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 17 నెలలకు హైదరాబాద్‌కు స్వాతంత్య్రం వచ్చింది. ఇక నిజాం వ్యతిరేక పోరాటంలో హిందువులతో పాటు తురేబాజ్ ఖాన్, షోయబుల్లా ఖాన్ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మరి చరిత్రలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన 'రజాకార్' మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

ఇదీ చదవండి: రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ ధర 1986లో ఎంతో తెలుసా? ఇదిగో బిల్ చూడండి..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News