చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.

Last Updated : Jul 19, 2018, 08:04 PM IST
చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఆడ, మగ, నపుంసక జాతికి కూడా చెందని నాల్గవ జెండర్ చంద్రబాబు అని తీవ్ర పదజాలంతో దూషించారు. ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు రంగులు మార్చే ఊసరవెల్లి అని విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ఒకవైపు కేంద్రంతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్న చంద్రబాబు.. మరొక వైపు ఏమీ తెలియనట్లు అవిశ్వాస తీర్మానం పెట్టడం హాస్యాస్పదమని ఆయన అన్నారు.

ఒకప్పుడు వైసీపీ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావించినప్పుడు దాని వల్ల ప్రయోజనం లేదని చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందో తెలియజేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సాఆర్ పార్టీ మొదటి నుంచీ ఒక్కటే మాట చెబుతుందని.. ప్రత్యేక హోదా రావాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు.

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఏ పార్టీ పెట్టినా.. వైసీపీ మద్దతు ఇస్తుందని గతంలో చెప్పామని ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. లోక్ సభలో తమ సభ్యులు లేకపోయినా తాము టీడీపీ పెట్టే అవిశ్వాస విషయంలో ఆ పార్టీకి సంఘీభావం తెలియజేస్తామని ఆయన అన్నారు. 

Trending News