ఒక వేళ మోడీతో జతకడితే ..... రోజా

Last Updated : Mar 16, 2018, 03:44 PM IST
ఒక వేళ మోడీతో జతకడితే ..... రోజా

పవన్ కల్యాణ్ పై టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాడ్లాడుతూ మొన్నటి వరకు టీడీపీ నేతలు పవన్ కల్యాణ్  భజన చేశారు. ఆయన చాలా మంచోడని పొగడ్తలతో ముంచెత్తారు. అవినీతి గురించి ప్రశ్నించేసరికి ఆయన చెడ్డవాడు అయిపోయాడని రోజా ఎద్దేవ చేశారు. పవన్ విమర్శించినట్లుగా ఆర్థిక నేరస్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేషేనన్నారు. 

వైసీపీపై టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని రోజా దయ్యబట్టారు. బీజేపీతో కుమ్మక్కై హోదా ఉద్యమాన్ని జగన్ పక్కదారి పట్టిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు..ఒక వేళ తాము బీజేపీతో జతకడితే ..తాము మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెడతామని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు మారి..రాష్ట్రప్రయోజానాలు,  ప్రత్యేక హోదా కోసం పోరాడితే జనాలు హర్షిస్తారని వైసీపీ మహిళా నేత , ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. 

Trending News