ఏపీలో తాజాగా 62 కరోనా కేసులు, ఇద్దరి మృతి

ఎన్ని కఠిన చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటున్నా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతునే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన టెస్టుల్లో ఏపీలో కొత్తగా 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 24, 2020, 05:03 PM IST
ఏపీలో తాజాగా 62 కరోనా కేసులు, ఇద్దరి మృతి

ఎన్ని కఠిన చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటున్నా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతునే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కోవిడ్19 టెస్టుల్లో ఏపీలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 955 కు పెరిగింది. జిల్లాలవారీగా చూస్తే కర్నూలు 27, కృష్ణా 14, గుంటూరు 11, అనంతపురం 4, ప్రకాశం 3 తూర్పుగోదావరి 2, నెల్లూరు జిల్లాలో ఒక్క కేసు నమోదయ్యాయి. సచిన్... ది గ్రేట్ బౌలర్.. హీరోగా నిలిపిన ప్రదర్శనలివే

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు కరోనా బారిన పడి చనిపోయారు. దీంతో ఏపీలో కరోనా మరణాల సంఖ్య 29కు చేరుకుంది. కరోనాకు చికిత్స అనంతరం కోలుకుని ఇప్పటివరకూ 145 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజా కరోనా మరణాలలో అనంతపురం, కర్నూలు ఒక్కోటి చొప్పున సంభవించినట్లు అధికారులు తెలిపారు. కరోనాను తరిమికొట్టిన మరో రాష్ట్రం

Image Credit: twitter/@ArogyaAndhra 

అక్కడ ఒక్కరోజులో 778 కొత్త కేసులు, 14 మంది మృతి

మొత్తం 6306 శాంపిల్స్ టెస్టు చేయగా 62 మందికి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం 781 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలవారీగా చూస్తే కర్నూలు 261, గుంటూరు 206 కేసులతో కరోనా తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్నాయి. 

  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

 

Trending News