CM Revanth Reddy: పదేళ్లు అడవి పందుల్లా దోచుకున్నారు.. కేసీఆర్ కు సీఎం రేవంత్ ధమ్కీ.. వైరల్ గా మారిన వీడియో..

Tukkuguda Meeting: తెలంగాణను పదేళ్లాపాటు బీఆర్ఎస్ నేతలు పదేళ్ల పాటు దోపిడీ దొంగల్లా.. అడవి పందుల్లా దోచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో ఆయన మాజీ సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 6, 2024, 09:43 PM IST
  • కేసీఆర్ కు చిప్పకూడు తినిపిస్తాం..
  • బీజేపీని బోందపెట్టాలని పిలుపునిచ్చిన సీఎం రేవంత్
CM Revanth Reddy: పదేళ్లు అడవి పందుల్లా దోచుకున్నారు.. కేసీఆర్ కు సీఎం రేవంత్ ధమ్కీ.. వైరల్ గా మారిన వీడియో..

CM Revanth Reddy Fires On BRS KCR In Tukkuguda Meeting: బీఆర్‌ఎస్ నేత కేసీఆర్ నోటి కొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోనేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.  తాను.. పెద్దలు జానా రెడ్డిని కాదు.. సీఎం రేవంత్ రెడ్డి అని తనదైన స్టైల్ లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కు చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపించడం ఖాయమన్నారు. అదే విధంగా, కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం కట్టించి తీరుతామన్నారు. సోనియమ్మ తెలంగాణకు ఆరు గ్యారంటీలు ప్రకటించిన గడ్డపైనే రాహుల్ గాంధీ దేశానికి ఐదు గ్యారంటీలు ప్రకటించారన్నారు. తుక్కు గూడలో పాల్గొనడానికి వచ్చిన ప్రజలను చూస్తుంటే.. ఉత్తర తెలంగాణ నుంచి గోదావరి, దక్షిణ తెలంగాణ నుంచి కృష్ణా నది ఒకేసారి పోటెత్తినట్లుందన్నారు. మీ శ్రమ, మీ కష్టం, మీ త్యాగంతోనే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని గుర్తుచేశారు.

 

తెలంగాణ స్పూర్తితో కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొద్దామని ప్రజలను కోరారు. గుజరాత్ మోడల్ పై..  వైబ్రాంట్ తెలంగాణ మోడల్ ఆధిపత్య చూపడం ఖాయమని రేవంత్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం ఖాయమని, దేశ ప్రజలకు ఏం చేశారని బీజేపీకి ఓటు వేయాలంటూ అడిగారు. 20కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. 7లక్షల 20వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు బీజేపీకి ఓటు వేయాలా?.. లేదా.. 750 రైతులను చంపినందుకు బీజేపీకి ఓటు వేయాలా?.. అంటూ ఎద్దేవా చేశారు. ప్రతీ పేదవాడికి ఇల్లు ఇస్తామన్న మోదీ.. తెలంగాణలో ఎంతమందికి ఇండ్లు ఇచ్చారో చెప్పాలన్నారు. 

దక్షిణ భారతం,ఉత్తర భారతం మధ్య చిచ్చు పెట్టి మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. గతంలో హైదరాబాద్ వరదల్లో మునిగితే సిగ్గులేని కిషన్ రెడ్డి కేంద్రం నుంచి ఒక్క రూపాయి తీసుకురాలేడన్నారు.తెలంగాణలో రాష్ట్రంలో బీఆర్ఎస్  ను బొందపెట్టినట్టే.. కేంద్రంలో బీజేపీని బొంద పెట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. భాష గురించి, భావం గురించి నిన్న మొన్న కొన్ని నక్కలు మాట్లాడుతున్నాయి... ఇప్పుడు వెంట్రుక కూడా పీకలేరని మాట్లాడుతున్నారు.. మా కాంగ్రెస్ కార్యకర్తలు తలచుకుంటే మీ ఒంటిమీద అంగీ లాగు కూడా మిగలదని సీఎం రేవంత్ రడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ కాలు విరిగిందని కొంత కాలం మేం సంయమనం పాటించాం.. మీరేం చేసినా మేం ఊరుకుంటామనుకోవద్దంటూ రేవంత్ హెచ్చరించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిన చోట మీరు ఓట్లు అడగండి... ఇందిరమ్మ ఇండ్లు ఉన్న చోట మేం ఓట్లు అడుగుతామన్నారు. వంద రోజుల్లో మేం మంచి పరిపాలన అందిస్తే తెలంగాణలో 14 లోక్ సభ స్థానాలు గెలిపించాలని సీఎంరేవంత్ ప్రజలను కోరారు.తెలంగాణ సమాజం అభివృద్ధికి  భవిష్యత్ తో నిధులు తెచ్చుకోవాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.

Read More: Snakes: ఇదేం విడ్డూరం.. పాముల్ని పెంచుకుంటున్న గ్రామస్థులు.. హనీ కలిగిస్తే అరెస్ట్ చేస్తారంట..

గంటకో డ్రస్ మార్చే మోదీ కావాలో.. ప్రజల కోసం దేశమంతా పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సీఎం రేవంత్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఈడీ,ఐటీ, సీబీఐ ల మోదీ కుటుంబం గెలుస్తుందో.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబం గెలుస్తుందో చూద్దామంటూ సీఎం రేవంత్ తనదైన స్టైల్ లో స్పీచ్ దంచికొట్టారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News