ఉన్మాది దాడి: బాధితురాలు సంధ్యారాణి కన్నుమూత

ఉన్మాది ఘాతుకానికి మరో యువతి బలైపోయింది..

Last Updated : Dec 22, 2017, 04:08 PM IST
ఉన్మాది దాడి: బాధితురాలు సంధ్యారాణి కన్నుమూత

హైదరాబాద్: ఉన్మాది ఘాతుకానికి బలైన సంధ్యారాణి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.  ప్రేమించడం లేదన్న కారణంతో  ఉన్మాదిగా మారిన ఓ దుర్మార్గుడు  ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గురువారం సాయంత్రం లాలాపేట అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో  చికిత్స పొందుతున్న సంధ్యారాణి ఈ రోజు ఉదయం కన్నుమూసింది. ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి ఆమె శరీరం 70 శాతం కాలిపోయి ఉంది. వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. నడిరోడ్డుపై సంధ్యారాణిపై పెట్రోల్  పోసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. కాగా ఈ కేసులో నిందితుడు కార్తీక్ ఆ వెంటనే లొంగిపోగా..అతనిపై పెట్టిన హత్యాయత్నం కేసును, ఇప్పుడు హత్య కేసుగా మార్చనున్నట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.  

Trending News