ప్రపంచ దేశాలకు తాము కరోనా వ్యాక్సిన్ (Corona Vaccine)ను అందిస్తామని రష్యా ప్రధాన మంత్రి మిఖైల్ మిషుస్తిన్ పేర్కొన్నారు. తమ దేశంలో అత్యుత్తమ కోవిడ్19 టీకాలు ఉత్పత్తి అవుతున్నాయని రష్యా పార్లమెంట్్ దిగువ సభలో తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడిస్తూనే ఉంది. అన్నిదేశాల్లో మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఎలాగైనా కరోనాకు చెక్ పెట్టేందుకు చాలా దేశాలు వ్యాక్సిన్ను కనుగునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.
చైనా (china) భూ దాహానికి అంతులేకుండా పోతోంది. కరోనా వైరస్ (Coronavirus) ను మొత్తం ప్రపంచానికి వ్యాప్తిచేసిందన్న ఆరోపణల తరువాత చైనా అనేక దేశాలతో సంబంధాలను తెంచుకుంటూ ఘర్షణలకు దిగుతూ వస్తోంది. ఇటీవలనే భారతదేశం (india-china), మయన్మార్, జపాన్ తరువాత, చైనా ఇప్పుడు రష్యా (russia)కు వ్యతిరేకంగా కయ్యానికి కాలుదువ్వుతోంది.
Indo China tensions: భారత్, చైనా సరిహద్దుల్లో ఘర్షణ అనంతరం రెండు దేశాల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలను పొరుగు దేశమైన రష్యా ( Russia ) ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. సరిహద్దు వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు ఇరు దేశాలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయని రష్యా అభిప్రాయపడింది.
India vs China: ఇండో చైనా సరిహద్దులో ( Indo china border ) తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఒకవేళ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే భారత్కు రష్యా నుంచి సహకారం అందుతుందా ? ఇవాళ మాస్కోలో జరిగిన రష్యన్ డే పరేడ్లో ( Russian victory day parade ) భారత ఆర్మీ పాల్గొనడం దేనికి సంకేతాలిస్తోంది అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రపంచాన్ని అతలాకుతలం కరోనా మహమ్మారి క్లిష్ట పరిస్థితుల్లో తాజాగా ఈ ప్రపంచానికి కొత్త శత్రువు సవాలు విసురుతోంది. రష్యాలో మనుషుల రక్తాన్ని పీల్చి చంపేసే పినుజులు భీభత్సం సృష్టిస్తున్నాయి.
ప్రపంచాన్ని రోజు రోజుకు కరోనా మహమ్మారి కబళించివేస్తోంది. అయితే రష్యాలోని ఓ ఆసుపత్రిలో కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో గదిలోని వెంటిలేటర్ లో ఒక్కసారిగా మంటలు రావడంతో
కరోనావైరస్ మహమ్మారి ఆ దేశం, ఈ దేశం అని కాకుండా అన్ని ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. కరోనా దెబ్బకు అగ్రరాజ్యమైన అమెరికా ఎంత ప్రాణ నష్టాన్ని చవిచూస్తుందో తెలిసిందే. అమెరికా లాగే ఎంతో అభివృద్ధి చెందిన రష్యాలోనూ కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. నిత్యం కొత్తగా వేల సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతుండటం రష్యాను కలవరానికి గురిచేస్తున్నాయి.
భవిష్యత్తు యుద్ధాలన్నీగాల్లోనే జరుగుతాయి. శత్రువులు కూడా గాల్లోనే గాల్లో కలిసిపోతారు. ఎందుకంటే ప్రపంచంలోని సూపర్ పవర్ దేశాలన్నీ అత్యాధునిక క్షిపణులపైనే దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఏయే దేశాల వద్ద ఎటువంటి అత్యాధునిక ఆయుధాలు, మిస్సైల్స్ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నమే ఈ వారం రక్షక్ కార్యక్రమంలో ప్రధాన కథాంశం.
ఈ మధ్యకాలంలో ఫుట్ బాల్ వరల్డ్ కప్ లైవ్ కవరేజ్ చేస్తున్న ఓ విదేశీ మహిళా రిపోర్టర్కి ఓ ఆగంతకుడు వచ్చి ముద్దు పెట్టిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలా ముద్దు పెట్టిన సదరు వ్యక్తిపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి.
2018లో దక్షిణ కొరియాలో జరిగే ఒలింపిక్ పోటీలకు రష్యా ప్రభుత్వం తమ క్రీడాకారులను పంపాల్సిన అవసరం లేదని.. ఆ వేడుకలో రష్యా జెండా ప్రదర్శన గానీ.. జాతీయ గీతం ఆలాపన గానీ వినిపించదని కమిటీ నిర్థారించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్ బుక్ సంస్థ ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ మాట్లాడుతూ తమ సంస్థ ఎల్లవేళలా తటస్థంగా ఉండడానికే ప్రయత్నిస్తుందని చెప్పారు.ట్రంప్ ఫేస్ బుక్ సంస్థను విమర్శిస్తూ, ఈ సోషల్ మీడియా సంస్థ ఎప్పుడూ తనకు వ్యతిరేకమేనని తెలిపారు. ఎల్లో జర్నలిజంతో కూడిన వార్తలు ప్రచురించడం, పక్షపాత వైఖరి చూపించడం ఫేస్ బుక్ నైజమని తెలియజేశారు. సాధారణంగా 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో రష్యా పాత్రపై కూడా ఫేస్ బుక్ దర్యాప్తుకు సహకరిస్తామని చెప్పిందని, సాధారణంగా ఏదైనా నచ్చని వార్తా
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.