కరోనా కేసులు ( Corona cases ) రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణలో అన్ని ప్రవేశపరీక్షల్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. టీఎస్ ఎంసెట్ ( TS EAMCET ) తో సహా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది.
COVID-19 cases in India: న్యూ ఢిల్లీ: భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో గతంలో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షల మార్క్ దాటేసింది.
కరోనా వైరస్(CoronaVirus) తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. కేసులు ఇలాగే పెరిగిపోతుంటే భారత్ అగ్రస్థానానికి చేరి పరిస్థితి పూర్తిగా అదుపుతప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకనుంచైనా ప్రజలు తగిన జాగ్రత్తలు వహిస్తేనే కరోనా మహమ్మారిని నియంత్రించగవచ్చు.
ఏపీలో కరోనావైరస్ పాజిటివ్ కేసులకు ( Coronavirus positive cases ) ఇంకా బ్రేకులు పడటం లేదు. శనివారం రాష్ట్రంలో కొత్తగా మరో 43 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,930కి చేరింది.
తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇదివరకు తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసుల సంఖ్యలో తాజాగా స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. తెలంగాణలో నేడు కొత్తగా మరో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనావైరస్ కాటుకు మరొకరు బలయ్యారు. విజయనగరం జిల్లా ( Vizianagaram district ) బలిజపేట మండలం చిలకలపల్లికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు కరోనాతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర అనారోగ్యం పాలైన వృద్ధురాలు విశాఖలోని విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డయాలసిస్ ( Dialysis VIMS ) చికిత్స తీసుకుంటున్నారు.
తెలంగాణలో సోమవారం కొత్తగా మరో 3 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనివేనని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1085కు చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్లో తబ్లీగి జమాత్ నిర్వహించిన మతపరమైన కార్యక్రమం వల్లనే రెండు రోజుల్లోనే దేశంలో 647 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్రం ఒక బులెటిన్ విడుదల చేసింది. కాగా దేశంలోని 14 రాష్ట్రాలు
లాక్డౌన్ సమయంలో కేంద్రం విధించిన ఆంక్షలను లెక్కచేయకుండా రోడ్లపైకి వస్తున్నారా ? ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా ? అయితే ఇదిగో ఇది మీ కోసమే. దేశవ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్డౌన్ నిబంధనను ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
భారత్లో కరోనావైరస్ కాటుకు మరొకరు బలయ్యారు. గుజరాత్లోని అహ్మెదాబాద్లో కరోనావైరస్ బారినపడిన 85 ఏళ్ల వృద్ధురాలు బుధవారం రాత్రి మృతిచెందారు. ఈ వృద్ధురాలి మరణంతో భారత్లో కరోనావైరస్తో బాధపడుతూ మృతి చెందిన వారి సంఖ్య 12కి చేరింది.
తెలంగాణలో నేడు మరో 2 కరోనావైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో వెలుగుచూసిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 41కి చేరింది. నేడు గుర్తించిన కరోనా పాజిటివ్ కేసుల్లో ఒక మహిళతో పాటు మూడేళ్ల బాబు సైతం ఉన్నారు.
భారత్లో వ్యాపిస్తున్న కరోనావైరస్కి ప్రధాన కారణం విదేశీయులు.. లేదా విదేశాలకు వెళ్లొచ్చిన భారతీయులేనని పదేపదే నిరూపితమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అటువంటు ఘటనే మరొకటి చోటుచేసుకుంది.
హంటావైరస్... ఇప్పటికే కరోనావైరస్ చేస్తోన్న విలయ తాండవం సరిపోదన్నట్టుగా కొత్తగా మళ్లీ ఇదేం వైరస్ అని అనుకుంటున్నారా ? అయితే దీని గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిందే. కరోనావైరస్ పుట్టిన చైనాలోనే ఈ వైరస్ కూడా పుట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.