Virat Kohli Break: విరాట్​ కోహ్లీకి బ్రేక్​- వెస్డిండీస్​తో మూడో టీ20కి దూరం..!

Virat Kohli Break: వెస్టిండిస్​తో జరుగుతున్న టీ20 సిరీస్​లో మూడో మ్యాచ్​కు.. సీనియర్​ బ్యాటర్ విరాట్​  కోహ్లీ దూరం కానున్నాడు. బీసీసీఐ అతడికి 10 రోజులు బ్రేక్​ ఇచ్చింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2022, 11:45 AM IST
  • విరాట్​ కోహ్లీకి మళ్లీ బ్రేక్​
  • వెస్టిండీస్​తో చివరి టీ20కి దూరం
  • శ్రీలంకతో టీ20 సిరీస్​కు కూడా..
Virat Kohli Break: విరాట్​ కోహ్లీకి బ్రేక్​- వెస్డిండీస్​తో మూడో టీ20కి దూరం..!

Virat Kohli Break: టీమ్​ ఇండియా మాజీ కెప్టెన్​, సీనియర్ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ వెస్టిండీస్​తో జరగనున్న మూడో టీ20 మ్యాచ్​కు దూరం కానున్నాడు. కోల్​కతా వేదికగా వేదికగా రేపు (ఆదివారం) ఈ మ్యాచ్​ జరగనుంది. విరాట్​ కోహ్లీకి బయోబబుల్ నుంచి 10 రోజులు బ్రేక్ ఇచ్చింది బీసీసీసీ. కోహ్లీ ఇంటికి వెళ్లనున్నందుకు గానూ.. ఈ బ్రేక్ ఇచ్చింది.

ఇప్పటికే వెస్టిండీస్​తో జరిగిన రెండు టీ20 మ్యాచుల్లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించి సిరీస్​ను సొంతం చేసుకుంది. రేపు జరగనున్న మ్యాచ్​ కేవలం నామమాత్రపు మ్యాచ్​ కానుంది..

శ్రీలంక సిరీస్​కూ కోహ్లీ దూరం..

వెస్టిండీస్​తో జరగనున్న చివరి టీ20తో పాటు.. ఫిబ్రవరి 24 నుంచి శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్​కు సైతం విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు.

శ్రీలంకతో మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ ఫిబ్రవరి 24న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​ లఖ్​నవూలో జగనుంది. మిగతా రెండు మ్యాచ్​లు ధర్మశాల వేదికగా జరగనున్నాయి. ఫిబ్రవరి 26న రెండో టీ20, 27న మూడో టీ 20 జరగనుంది.

'విరాట్​ కోహ్లీ శనివారం ఇంటికి వెళ్లనున్నాడు. వెస్టిండీస్​తో ఇప్పటికే టీ20 సిరీస్​ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫార్మాట్లలో ఆటగాళ్లకు.. పని భారం సహా ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఇలా విరామం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.' అని బీసీసీఐ వర్గాలు వార్తా సంస్థ పీటీఐతో వెల్లడించాయి.

కోహ్లీ బ్యాక్​ టూ ఫామ్?

ఇక గత కొంత కాలంగా పేలవ ప్రదర్శనతో వార్తల్లో నిలుస్తున్న విరాట్ కోహ్లీ.. తాజాగా ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. శుక్రవారం వెస్టిండీస్​తో జరిగిన రెండో టీ20 మ్యాచ్​లో కోహ్లీ ఆటకు ప్రశంసలు దక్కాయి. విరాట్​ కోహ్లీ, రిషబ్​ పంత్​ భాగస్వామ్యం సహా భువనేశ్వర్​ కుమార్​, హర్షల్ పటేల్​ల బౌలింగ్​ కారణంగా ఎనిమిది పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించి.. సిరీస్​ను కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్​లో కోహ్లీ 41 బంతుల్లో 52 పరుగులు చేసి అవుటయ్యాడు. రిషబ్​ పంత్​ 28 బాల్స్​లో 52 కొట్టి జట్టుకు విజయాన్నందించాడు.

Also read: IND vs WI: మెరిసిన కోహ్లీ, భువీ.. రెండో టీ20లో భారత్ ఉత్కంఠ విజయం! సిరీస్ కైవసం!!

Also read: IND vs WI: ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ.. పంత్ సూపర్ హాఫ్ సెంచరీ! విండీస్​ లక్ష్యం 187!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News