Rishabh Pant-Urvashi Rautela: నాపై ఇన్ని పచ్చి అబద్దాలా.. బాలీవుడ్ హీరోయిన్‌పై రిషబ్ పంత్ ఫైర్!

Rishabh Pant fires on bollywood actress Urvashi Rautela. ఊర్వశి రౌటెలా పేరు ప్రస్తావించకుండా.. ఫేమ్, పాపులారిటీ కోసం పచ్చి అబద్దాలు ఆడుతారా అని రిషబ్ పంత్ ఫైర్ అయ్యాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 11, 2022, 05:06 PM IST
  • మిస్టర్ ఆర్‌పీ నుంచి 17 మిస్డ్ కాల్స్
  • నాపై ఇన్ని పచ్చి అబద్దాలా
  • బాలీవుడ్ హీరోయిన్‌పై రిషబ్ పంత్ ఫైర్
Rishabh Pant-Urvashi Rautela: నాపై ఇన్ని పచ్చి అబద్దాలా.. బాలీవుడ్ హీరోయిన్‌పై రిషబ్ పంత్ ఫైర్!

Rishabh Pant hits out bollywood actress Urvashi Rautela: భారత క్రికెటర్‌లకు, బాలీవుడ్ హీరోయిన్‌లకు మధ్య విడదీయరాని బంధం ఉంది. ఎంద‌రో క్రికెట‌ర్లు బాలీవుడ్ హీరోయిన్‌లతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు. వారిలో కొన్ని జంట‌లు పెళ్లిపీట‌లెక్క‌గా.. మ‌రికొన్ని జంట‌లు మ‌నస్ఫ‌ర్ధ‌ల‌తో విడిపోయాయి. కపిల్​దేవ్​-సారికా, యువరాజ్ సింగ్-హేజెల్ కీచ్, హర్భజన్ సింగ్-గీతా బస్రా, జహీర్ ఖాన్-సాగరిక ఘట్గే, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, హార్దిక్ పాండ్యా-నటాషాలు పెళ్లి పీటలెక్కారు. అయితే కొందరు హీరోయిన్స్ భారతీయ క్రికెటర్‌లతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి చివరకు బై బై చెప్పుకున్నారు. అందులో రిషబ్ పంత్, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా కూడా ఉన్నారు. 

ఎంఎస్ ధోనీ వారసుడిగా భారత జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ అనతి కాలంలోనే స్టార్ అయ్యాడు. తన ఆటలోనే కాదు, ప్రేమమా విషయాలతోనూ క్రేజ్‌ను సంపాదించాడు. బాలీవుడ్ హీరోయిన్‌ ఊర్వశి రౌటెలాతో పంత్ రిలేషన్‌లో ఉన్నాడని 2018లో వార్తలు వచ్చాయి. లంచ్, డిన్నర్ లేదా పార్టీస్ అంటూ ఇద్దరూ కలిసి తిరిగారు. దాంతో ఊర్వశి, పంత్ డేటింగ్‌లో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూసింది. ఏమందో ఏమో తెలియదు కానీ ఇద్దరు విడిపోయాయారు. తమ ఎండీ ఏమీ లేదని పంత్ క్లారిటీ ఇచ్చాడు. కొద్ది రోజులకే మోడల్‌ ఇషా నేగితో ప్రేమలో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించాడు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేరు చెప్పుకుండా ఆర్‌పీ అని సంబోధిస్తూ. తన ప్రేమ ఎక్కడ చెడిందనే  విషయాన్ని ఊర్వశి రౌటెలా చెప్పారు. 'వారణాసిలో నేను ఓ సినిమా షూటింగ్‌ చేశాను. వారణాసి నుంచి న్యూ ఢిల్లీకి వచ్చి ఓ షోలో పాల్గొన్నా.అక్కడ రోజంతా షూటింగ్‌ పని చేశా. తర్వాతి రోజు ఫ్లైట్ ఎక్కి వారణాసి వెళ్లా. ఆ సమయంలో నన్ను కలవడానికి మిస్టర్ ఆర్‌పీ వచ్చాడు. నేను ఉంటున్న హోటల్‌కు వచ్చి లాబీలో చాలా సమయం వెయిట్ చేశాడు. అతను వచ్చిన 10 నిమిషాల ముందే నేను షూటింగ్‌ నుంచి హోటల్‌కు వచ్చి పడుకున్నా. అసలిపోయిన కారణంగా బాగా నిద్రపోయా' అని ఊర్వశి తెలిపింది. 

'గాఢ నిద్రలో ఉన్న నాకు ఫోన్ రింగ్ కూడా వినిపించలేదు. లేచి చూసేసరికి మిస్టర్ ఆర్‌పీ నుంచి 17 మిస్డ్ కాల్స్ వచ్చాయి. నేను చాలా ఫీల్ అయ్యా. నా కోసం అతను అంతలా వెయిట్ చేశాడా అని బాధపడ్డాను. వెంటనే ఫోన్ చేసి ముంబై వచ్చాక కలుస్తానని చెప్పా. ఆపై  ముంబైకి వెళ్లినప్పుడు అతడిని కలిసా. అప్పుడు మిస్టర్ ఆర్‌పీ బాగానే ఉన్నాడు. ఆ తర్వాతే ఏం జరిగిందో తెలీదు కానీ.. అతను నాతో మాట్లాడటం మానేసాడు. నన్ను బ్లాక్ చేశాడు. ఈ విషయంపై మీడియా ఎన్నో రకాల కథనాలు రాసుకొచ్చింది. మా మధ్య మరింత దూరం పెరిగింది' అని ఊర్వశి రౌటెలా చెప్పకొచ్చారు. 

ఊర్వశి రౌటెలా చేసిన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రిషబ్ పంత్ స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఊర్వశి పేరు ప్రస్తావించకుండా.. ఫేమ్, పాపులారిటీ కోసం పచ్చి అబద్దాలు ఆడుతారా అని ఫైర్ అయ్యాడు. 'కొందరు ఫేమ్, పాపులారిటీ కోసం పచ్చి అబద్దాలు ఆడతారు. కేవలం వార్తల్లో నిలిచేందుకు ఇలా చేస్తారంటే నవ్వొస్తుంది. పేరు, ఫేమ్ కోసం ఇలా అబద్దాలు చెప్పే వారిని చూస్తుంటే బాధగా ఉంటుంది. వాళ్లకి దేవుడి ఆశీస్సులు ఉండాలి' అని పంత్ పేర్కొన్నాడు.

Also Read: ఈ జీతంతో మీకు పన్నులు కట్టాలా.. నా పిల్లలకు తిండి పెట్టాలా! ప్రధానిపై మహిళ ఆవేదన

Also Read: Sourav Ganguly Resign: బీసీసీఐ అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ రాజీనామా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News