హాకీలో ఇంగ్లాండ్‌తో భారత జట్టు డ్రా..!

దాదాపు తొమ్మిది పెనాల్టీ కార్నర్‌ అవకాశాలను విడిచిపెట్టు్కొని.. విజయాన్ని దూరం చేసుకున్న భారత యువ హాకీ జట్టు.. తమకు పాజిటివ్‌గా మారబోతున్న ఆటను చేతులారా జాడవిడుచుకుంది. 

Last Updated : Mar 4, 2018, 06:47 PM IST
హాకీలో ఇంగ్లాండ్‌తో భారత జట్టు డ్రా..!

దాదాపు తొమ్మిది పెనాల్టీ కార్నర్‌ అవకాశాలను విడిచిపెట్టుకొని.. విజయాన్ని దూరం చేసుకున్న భారత యువ హాకీ జట్టు.. తమకు పాజిటివ్‌గా మారబోతున్న ఆటను చేతులారా జాడవిడుచుకుంది. ఆజ్లాన్‌ షా హాకీ టోర్నీలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించి అభిమానుల ఆశలను అడియాసలు చేసింది. యువ భారత ఆటగాడు శీలానంద్‌ లర్కా 14వ నిమిషంలో చేసిన గోల్ తప్ప భారత్ ఈ గేమ్‌లో ఎలాంటి మెరుపులూ కురిపించలేదు. అయితే శీలానంద్ అతడి కెరీర్‌లో తొలి గోల్ చేయడంతో..‌. జట్టు కనీసం డ్రాతోనైనా సరిపెట్టుకుంది.

చిత్రమేంటంటే 53వ నిమిషంలో ఇంగ్లాండ్‌ ప్రేయర్ మార్క్‌ గ్లెగ్‌హార్న్‌ పెనాల్టీ కార్నర్‌ను బాగా ఉపయోగించుకొని మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించి భారత్ విజయావకాశాలకు గండి కొట్టాడు. ఈ డ్రాతో భారత్ ప్రస్తుతం ఈ టోర్నమెంటులో ఆరో స్థానంలో కొనసాగుతుంది. భారత్‌ మంగళవారం స్టార్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. 1983లో తొలిసారిగా ఆజ్లాన్‌ షా హాకీ టోర్నీ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా ఇప్పటికి 9 సార్లు ఈ టోర్ని గెలవగా.. భారత్ 4 సార్లు గెలుచుకుంది

Trending News