Sabarimala: అయ్యప్ప స్వాములకు మోడీ సర్కారు అదిరిపోయే శుభవార్త.. ఇకపై వాటికి చెల్లు..


Sabarimala: అయ్యప్ప స్వాములకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై విమానాల్లో ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ పలు నిబంధనలు సడలించింది.

1 /5

Sabarimala: ప్రతి యేట శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికీ ఎంతో మంది భక్తులు అయ్యప్ప మాల వేసుకొని మండలం దీక్ష తర్వాత ఎంతో భక్తితో ఇరుముడితో స్వామి వారిని దర్శించుకుంటు ఉంటారు.

2 /5

అయితే..ఇరుముడితో అయ్యప్ప స్వామిని సొంత వాహనాలతో పాటు రైళ్లలో వచ్చే ప్రయాణికులకు ఇరుముడి వల్ల ఎలాంటి ఇబ్బందులు పడటం లేదు.  

3 /5

కానీ విమానాల్లో ప్రయాణించి అయ్యప్ప దర్శనానికి వచ్చే అయ్యప్పలకు విమానాశ్రయాల్లో చెకింగ్ తో ఇబ్బందులను ఫేస్  చేస్తున్నారు. దీంతో శబరిమల వెళ్ల అయ్యప్ప భక్తులకు పౌర విమానయాన శాఖ శుభవార్త అందించింది.

4 /5

ఇరుముడితో కొండెక్కే భక్తుల కోసం  నిబంధనలు సడలించింది. సెక్యూరిటీ స్కానింగ్ అనంతరం భక్తులు పవిత్రమైన ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్ లోనే ప్రయాణించే అవకాశాన్ని కేంద్ర విమానాయాన శాఖ కల్పించింది.

5 /5

ఈ విషయాన్ని  పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. దీంతో అయ్యప్ప దర్శనం కోసం శబరిమల వెళ్లే భక్తులకు పెద్ద ఉపశమనం అని చెప్పాలి. దీంతో కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కారుకు అయ్యప్ప భక్తులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.