Arvind Kejriwal: 2022 ఎన్నికలే లక్ష్యం- నేడు పంజాబ్​కు అర్వింద్ కేజ్రివాల్​!

Arvind Kejriwal: ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) పంజాబ్​పై మరింత పట్టు సాధించేందుకు కసరత్తు ముమ్మరంగా చేస్తోంది. అప్​ నేత, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ నేడు పంజాబ్​లో పర్యటించనున్నారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 09:00 AM IST
  • నేడు పంజాబ్​లో పర్యటించనున్న ఢిల్లీ సీఎం
  • రెండు నెలల్లో ఇది ఆరోసారి
  • తిరంగ యాత్రలో పాల్గొననున్న అర్వింద్ కేజ్రివాల్​
Arvind Kejriwal: 2022 ఎన్నికలే లక్ష్యం- నేడు పంజాబ్​కు అర్వింద్ కేజ్రివాల్​!

Delhi CM Arvind Kejriwal to attend the APP’s ‘Tiranga Yatra’ in Pathankot on today: వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేఫథ్యంలో పంజాబ్​పై ప్రత్యేక దృష్టి సారించింది ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​). అప్​ జాతీయ కన్వినర్​, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్​ నేడు (డిసెంబర్ 2 గురువారం) పంజాబ్​లో (Arvind Kejriwal Punjab Visit) పర్యటించనున్నారు. పఠాన్​కోట్​లో నిర్వహించనున్న 'తిరంగ యాత్ర'లో (AAP's 'Tiranga Yatra') పాల్గొననున్నారు కేజ్రీవాల్.

ఈ కార్యక్రమంలో అర్వింద్​ కేజ్రీవాల్​తో పాటు.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియా (AAP leader Manish Sisodia) కూడా పాల్గొననున్నారు. సిసోడియా ఇప్పటికే పంజాబ్​లో 5 రోజుల పర్యటనలో ఉన్నారు.

ఏమిటి ఈ తిరంగ యాత్ర..

2022లో వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు క్యాడెర్​ను పెంచుకునే పనిలో పడింది ఆమ్​ ఆద్మీ పార్టీ. ఇందులో భాగంగానే తిరంగ యాత్ర పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఈ పార్టీ.. ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాలపై పట్టు సాధించేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.

కేజ్రీవాల్ పంజాబ్​ పర్యటన ఇది ఆరోసారి..

2022 ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ పంజాబ్​పై ప్రత్యేక దృష్టి సారించారు. గడిచిన రెండు నెలల్లో పంజాబ్​లో ఆయన ఆరో సారి పర్యటించనుండటమే (Punjab Assembly elections) ఇందుకు ఉదాహరణగా. పంజాబ్ ఎన్నికలపై వచ్చే ఏడాది తొలినాళ్లలోనే ప్రకటన వెలువడే అవకాశముంది.

2017లో రెండో అతిపెద్ద పార్టీగా ఆప్​..

పంజాబ్​లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అప్​.. 20 సీట్లు గెలిచి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ కారణంగానే ఈ సారి మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ.

పంజాబ్​లో 2017 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ 77 సీట్లు గెలిచి.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు స్పష్టమైన మెజారిటీని సాధించింది. ఫలితంగా.. 10 ఏళ్ల పాటు కొనసాగిన శిరోమణి అకాలీ ధల్​-బీజేపీల కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో శోరోమణి అకాలీ ధల్​కు 15 సీట్లు రాగా.. బీజేపీ మూడు స్థానాలకే పరిమితమైంది.

Also read: Mark Zuckerberg case : ఫేస్‌బుక్‌లో పోస్ట్‌పై జుకర్‌బర్గ్‌ పై కేసు, అఖిలేష్‌ అభిమాని చేసిన పని ఇది

Also read: Parliament Fire Today: పార్లమెంట్ లో అగ్ని ప్రమాదం.. కుర్చీలు, కంప్యూటర్లు దగ్ధం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News