బిర్యానీ డబ్బులు అడిగినందుకు.. పట్టపగలే మర్డర్..!

పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో పట్టపగలే నరహంతకులు ఓ నిండు ప్రాణాన్ని మట్టుబెట్టారు. 

Last Updated : Jun 5, 2018, 12:50 AM IST
బిర్యానీ డబ్బులు అడిగినందుకు.. పట్టపగలే మర్డర్..!

పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో పట్టపగలే నరహంతకులు ఓ నిండు ప్రాణాన్ని మట్టుబెట్టారు. ఓ షాపుకి బిర్యానీ తినడానికి వచ్చిన ఓ గ్యాాంగ్‌లోని వ్యక్తి డబ్బులు అడిగినందుకు షాపులో  పనిచేస్తున్న వ్యక్తిని తుపాకీతో కాల్చాడు. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆయన మార్గమధ్యంలోనే మరణించాడని డాక్టర్లు తెలిపారు.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇప్పటికే ఈ ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోగా.. ఆ గ్యాంగ్‌లోని ఇంకా ముగ్గుర్ని గాలిస్తున్నారు. కేవలం రూ.190 విలువ చేసే బిర్యానీ కోసం తుపాకీతో కాల్చారని.. ఆ పనిచేసిన వారు ఆ ప్రాంతంలోనే పెద్ద రౌడీలని షాపు యజమాని తెలిపారు. ఈ మధ్యకాలంలో ఈ రౌడీలు షాపుల్లోకి వచ్చి కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని.. వారి ఆగడాలు భరించలేకపోతున్నామని ఆయన తెలిపారు.

ఇప్పటికే ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. కేవలం ఈ ఘటనకు కారణం బిర్యానీ డబ్బులు కోసం జరిగిన గొడవా.. లేక ఇతరత్రా ఏవైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Trending News