India Covid-19: 65 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 65లక్షలు దాటగా.. మరణాల సంఖ్య నిన్ననే లక్ష మార్క్ దాటిన విషయం తెలిసిందే.

Last Updated : Oct 4, 2020, 10:49 AM IST
India Covid-19: 65 లక్షలు దాటిన కరోనా కేసులు

India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 65లక్షలు దాటగా.. మరణాల సంఖ్య నిన్ననే లక్ష మార్క్ దాటిన విషయం తెలిసిందే.. అయితే.. గత 24గంటల్లో శనివారం ( అక్టోబరు 3న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 75,829 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 940 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 65,49,374 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,01,782 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Bihar Assembly Election 2020: మహాకూటమి రథసారధిగా తేజస్వి యాదవ్

ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 55,09,967 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 9,37,625 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే కాస్త ఉమశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులతోపాటు.. రికవరీ రేటు క్రమంగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 84.13 శాతం ఉండగా..  మ‌ర‌ణాల రేటు 1.55 శాతంగా ఉంది. అయితే యాక్టివ్ కేసుల రేటు 14.32 శాతం ఉందని వైద్యశాఖ వెల్లడించింది. 

ఇదిలాఉంటే.. శనివారం దేశవ్యాప్తంగా 11,42,131 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో అక్టోబరు 3 వరకు మొత్తం 7,89,92,534 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. Also read: Harthras Case: హత్రాస్‌ కేసును సీబీఐకి అప్పగించిన సీఎం యోగి

Trending News