మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయాలనుకోవడం లేదు: ఆర్మీ చీఫ్

శుక్రవారం ఒక కార్యాక్రమంలో పాల్గొనటానికి పూణే వచ్చిన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ - మేము మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయాలనుకోవడం లేదన్నారు.

Last Updated : Dec 2, 2017, 03:59 PM IST
మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయాలనుకోవడం లేదు: ఆర్మీ చీఫ్

మేము మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయాలనుకోవడం లేదన్నారు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. శుక్రవారం ఒక కార్యాక్రమంలో పాల్గొనటానికి పూణే వచ్చిన ఆయన పైవిధంగా స్పందించారు. 

"మేము మరోమారు సరిహద్దు రేఖ వెంబడి సర్జికల్ స్ట్రైక్స్ చేయాలనుకోవడం లేదు. ఎందుకంటే అందులో కొత్తేమీ ఉండబోదు కాబట్టి. మేము సర్ ప్రైజ్ లే ఇవ్వాలనుకుంటే కొత్త ఐడియాలు వేస్తాం. ఆ ఐడియా ఎలా ఉంటుందంటే.. దానిని అవతలివాళ్లకు కూడా ఊహించలేరు. కానీ ఒక్కటైతే చెప్పగలను ఆ ఐడియా మాత్రం సర్జికల్ స్ట్రైక్స్ కంటే గంభీరంగా ఉంటుంది" అన్నారు. 2015 మయన్మార్, 2016 లో పీఓకే సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన ఆపరేషన్లు, అక్కడి విషయాల గురించి మాట్లాడిన బిపిన్.. ఉత్తర, తూర్పు సరిహద్దు రేఖ వెంబడి బలగాల మోహరింపు, అక్కడ ఉన్న పరిస్థితులపై వివరణ ఇచ్చారు.

Trending News