Precaution dose: 18 ఏళ్ల దాటిన వారికి ప్రికాషన్​ డోసు నేటి నుంచే.. ఈ విషయాలు తెలుసుకోండి

Precaution dose: దేశంలో 18 ఏళ్లు నిండిన అర్హులందరికీ ప్రికాషన్ డోసు ఇవ్వడం ప్రారంభించాయి ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాలు. మరి ఎవరెవరు? ప్రికాషన్ డోసు తీసుకోవచ్చు? మూడో డోసు ధర ఎంత? అనే పూర్తి వివరాలు మీకోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2022, 01:24 PM IST
  • నేటి నుంచి 18 ఏళ్ల దాటిన వారికి బూస్టర్ డోసు
  • ప్రైవేటు కేంద్రాల్లోనే తీసుకునేందుకు వీలు..
  • నిర్ణీత ధర చెల్లించి టీకా తీసుకోవండ తప్పనిసరి..
Precaution dose: 18 ఏళ్ల దాటిన వారికి ప్రికాషన్​ డోసు నేటి నుంచే.. ఈ విషయాలు తెలుసుకోండి

Precaution dose: కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్రం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ నుంచి మరింత రక్షణ కోసం.. ప్రికాషన్​ డోసు (బూస్టర్​ డోసు) 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తీసుకునే విధంగా అనుమతినిచ్చింది. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రమే ఈ డోసు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏప్రిల్​ 10 నుంచే ప్రైవేటు కేంద్రాల్లో ఇప్పటికే టీకా ప్రక్రియ ప్రారంభమైంది. మరి మీరు బూస్టర్ డోసు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే అంతకన్నా ముందు ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.

ప్రికాషన్​ డోసు గురించి కీలక విషయాలు..

  • కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం ప్రకారం.. నేటి నుంచి (ఏప్రిల్​ 10) ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ప్రికాషన్ డోసు వేస్తారు. అయితే మొదటి రెండు డోసులు తీసుకున్న తర్వత 9 నెలల తర్వాతే బూస్టర్ డోసు తీసుకోవాల్సి ఉంటుంది.
  • రెండు డోసుల టీకా ఉచితంగా తీసుకున్నా.. ప్రికాషన్ డోసుకు మాత్రం డబ్బులు చెల్లించాలి. ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రధాన టీకాలు సీరమ్​ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్​​, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్​ టీకాల ధరలను తగ్గించాయి. ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ఒక డోసు ధరను రూ.225గా నిర్ణయించాయి ఆ కంపెనీలు.
  • ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం.. 1963 నుంచి 2004 మధ్య జన్మించిన ప్రతి ఒక్కరూ ప్రికాషన్ డోసు తీసుకునేందుకు అర్హులు. అయితే రెండో డోసు తీసుకున్న 273 రోజులు తర్వాతే బూస్టర్​ డోసు తీసుకోవాలి.
  • ప్రికాషన్ డోసు తీసుకోవాలనుకునే వారు మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాలు వెళ్లి కొవిన్​ పోర్టల్ లోకి లాగిన్ అయ్యి.. రిజిస్ట్రేషన్ ఐడీని చూపిస్తే సరిపోతుంది.
  • ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో 15 ఏళ్లు దాటిన 96 శాతం జనాభా కనీసం ఒక డోసు కరోనా టీకా తీసుకున్నారు. రెండు డోసులు తీసుకున్న జనాబా 83 శాతం మంది.
  • ఇప్పటి వరకు దేశంలో 2.4 కోట్ల ప్రికాషన్​ డోసులు పంపిణీ చేసింది ప్రభుత్వం. ఇందులో హెల్త్​కేర్​, ఫ్రంట్​లైన్ వర్కర్స్​, 60 ఏళ్లు దాటిన వారు ఉన్నారు.
  • ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రైవేటు వ్యాక్సినేషన్​ కేంద్రాల్లో ప్రికాషన్ డోసు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. డిమాండ్​కు తగ్గట్లు టీకాల పంపిణీకి సిద్ధమని చెబుతున్నాయి ప్రైవేటు టీకా కేంద్రాలు.
  • 18 ఏళ్లు దాటిన వారందరు డబ్బులు చెల్లించి ప్రికాషన్ డోసు తీసుకోవాలని చెప్పినప్పటికీ.. ఫ్రంట్​లైన్​ హెల్త్​, ఫ్రంట్​లైన్ వర్కర్స్​కు మాత్రం ఉచితంగానే మూడో డోసు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
  • ప్రైవేటులో టీకా తీసుకుంటే రూ.225తో పాటు.. సర్వీస్​ ఛార్జ్ కింద తీసుకునే మొత్తంపై కూడా ప్రభుత్వం పరిమితులు విధించింది. రూ.150 కన్నా ఎక్కువగా సర్వీస్ ఛార్జీ వసూలు చేయొద్దని వ్యాక్సిన్​ కేంద్రాలకు సూచించింది.
  • ప్రికాషన్ డోసు తీసుకునే వారు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. తొలి రెండు డోసులు ఏ టీకా తీసుకున్నారో దానినే ప్రికాషన్ డోసుగా తీసుకోవాల్సి ఉంటుంది.

Also read: IMD Twitter Hack: షాకింగ్... భారత వాతావరణ శాఖ ట్విట్టర్ ఖాతా హ్యాక్..

Also read: Viral News: ఈ దొంగల ముఠా చేసిన పనికి ఇరిగేషన్ అధికారుల దిమ్మతిరిగింది...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News